జూన్ 2009


మైఖేల్ జాక్సన్ మనకిక లేడట !!!

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు

 తేది :26-06-2009

ఉవ్వెత్తు న ఆకాశానికెగసి

 అదే స్థితిన శతాబ్దాలు ….

తటిల్లున కడలి కూలి

మహోగ్ర తరంగం …..

పాపం శోక సంద్రాన

విశ్వ యువత

గుండె గుండెన గుడి కట్టుకు

 కొలువుండిన మైఖేలిక లేడట

మన జాక్సను తరలి రాని తీరాలకు

 ఎటో వెడలి పోయాడట

నిశ్చ్చేష్టులై

దిఘ్భ్రాన్తులై

యువత

ఆ సంగీత నృత్య రీతులకు

 సృష్టికర్త తానై , విధి విధాత తానై

 యువతకు స్ఫూర్తిదాత తానే అయి…..

ఆ నృత్యం తీరు వేరు

సంగీతపు హోరు వేరు

 వేగం వేగం వేగం వేగం

 కాంతి పయన వేగం

 కరాళ కర విన్యాసం

 పద తాడన పీడనం

మృదు పల్లవ గానం

 మేఘ ఘర్జనం

 వురుములు మెరుపులు

వర్షపు ఝల్లులు

 అవన్నీ అప్పటికీ,

 ఇప్పటికీ ,ఇంకెప్పటికీ

ఆయనకే చెల్లు.

అంతరంగ మధనం 

 రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

 తేది  : 26/12/2008
 
  
ఎన్నో భావాలు,
 మరెన్నో ఆలోచనలు,
 ఎన్నెన్నో ఘటనలు,
 ఎందఱో మనుషులు ,
ఎన్నో ప్రాంతాలు,
 చూసినవి, విన్నవి,
చదివినవి,
తెలుసుకున్నవి
ఎల్లప్పుడూ మనసుతలుపు 
తడుతూనే వుంటాయి  
అంతరంగాన
వెంటాడుతూ వుంటాయి ,
  
తమ గురించి
గతంలో కి రమ్మంటాయి .
గతం లో ఎదురొచ్చిన
పాత్రలూ మనసు
పొరల  తలుపుల 
కావల నిలుచుని 
తలుపులు తెరవమంటూ
మనో మందిర ద్వారాలు
తెరుచుకో జూస్తుంటాయి
తలపుల లోనికి  
చొచ్చుకు రాజూస్తుంటాయి
తమ సంగతేమిటని
అడుగుతూ  అల్లరి చేస్తుంటాయి.
  
చిన్ననాటినుండి
చితి వరకూ   
జరిగిన 
ఘటనలన్నీ
మనిషి మశ్తిష్కం లో
నిక్షిప్తమై
హఠాత్తుగా  గుర్తు చేస్తూ
  నిలదీస్తుంటాయి
అందులో
పుట్టి పెరిగిన వూరైతే మరీను



మిగతా ౨వ పేజి లో

                                                                              

                                                                                    చిట్కాయణం ..(1)

                                                                ‘ వెక్కిళ్ళు’
                                             ( వుపశమనానికో  చిట్కా )  
                                                  విషయ సమర్పణ :నూతక్కి రాఘవేంద్ర రావు  
                                                          తేది : 22 -06 -2009
      
ఈ రోజు తెల్ల వారు ఝామున  నాకు నాలుగ్గంటలకు నిదట్లోనే వెక్కిళ్ళు మొదలయ్యాయి .వెక్కిళ్ళు వస్తుంటే మాత్రం చాల ఇబ్బంది కలుగుతుంటుంది. లేచి కూరుచున్నాను .చిన్నప్పటినుంచి మామూలుగా చేసే  అమ్మమ్మ చిట్కా .. ఓ గ్లాసుడు మంచినీళ్ళు త్రాగాను. తగ్గలా.డీప్ బ్రీథ్ థెరపీ ట్రై చేసాను. లాభం లేక పోయింది. లేచి ధ్యాస మళ్ళించి అటూ యిటూ తిరగటం మొదలెట్టాను. ఏమీ లాభం లేక పోయింది. సడన్ గా ఓ చిట్కా గుర్తుకొచ్చింది . లోగడ ఓ సారి వెక్కిళ్ళు వచ్చి నప్పుడు ఏమీ పాలుపోక ఓ స్పూనుడు పంచ దార అంగట్లో వేసుకొని నాలుక పైకి నొక్కి పట్టి నిదానగా రసాన్ని గొంతులోకి పీలుస్తుంటే !!! ఆశ్చర్యం !!!!!వెక్కిళ్ళు మాయం.
ఇప్పుడూ అదే ప్రక్రియ ఎందుకు చేయ గూడదనుకొని , లేచి వంటింట్లోకి వెళ్లి ,  ఓ స్పూను పంచదార  ,తీసుకొని నాలుక తెరచి  లో నాలుక పైన పోసుకొని ,నాలుక లోనికి తీసుకొని ,పంచదార అంగిలికి నొక్కి పట్టి ,నిదానంగా రసాన్ని పీలుస్తూ పొతే  వెక్కిళ్ళు ఆగిపోయాయి.    ఇంతకు ముందు కూడా ఈ చిట్కా వల్ల  వెక్కిళ్ళ బాధ నుండి
వుపశమనం   పొంది వుండటం వల్ల ,దీన్ని నలుగురితో పంచుకొనే వుద్దేశ్యంతో యిలా మీ ముందుకు. 
 
చిట్కా :ఓ స్పూను పంచదార (కొంచెం మందమైన పలుకుంటే మంచిది .మెత్తటిదయినా ఫరవాలేదు. )తీసుకొని అంగిట్లో వేసుకోవాలి నాలుకను అంగిలి పై భాగానికి నొక్కి వుంచి నిదానంగా స్రావాన్ని లోనికి పీల్చుకోవాలి. అంతే వెక్కిళ్ళు ఆగి పోతాయి.
 
ఇందులో వున్న శాస్త్రీయత  ప్రక్రియ ఏమిటన్నది మాత్రం నాకు తెలియదు. అదీ కాక అందరికీ ఇది వుపయోగ పడుతుందా లేదా అన్నది కూడా నాకు తెలియదు.నేనే కాక  ఈ చిట్కా వుపయోగించుకొని  నాకు తెలిసిన చాలా మంది లాభ పడ్డారు అన్న విషయం మాత్రం వాస్తవం. అలాగని అందరికీ వుపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. .
 
ఆ తరువాత అంతర్జాలంలో వెతికాను. Hiccups అని టైపు చేసి సెర్చ్ చేస్తే   వెక్కిళ్ళ జాతకం, నివారణా మార్గాలు ఓ  రెండు వందల దాకా వున్నాయి. అందులో నా స్వంతంగా నేర్చుకున్న చిట్కా కూడా వుందండోయ్ .( అంటే అది  ఎవరి స్వంతమూ   కాదన్న మాట. గుండు సూది గుచ్చి గాలి తీసినట్లయ్యింది నా పరిస్తితి. )
 
వెక్కిళ్ళు ,వాటి ఆగమన కారణాలు (సర్వ సాధారణమైనవి),నివారణోపాయాలు (మరి కొన్ని)
వివరంగా తెలియ చేసేందుకు మరో సారి మీ ముందుకు వస్తాను. 
 
జాగ్రత్తలు: కానీ ఈ ప్రక్రియలో చిన్న జాగ్రత్త పాటించాలి. అదేంటంటే పంచదార గొంతులో వేసుకొనేటప్పుడు  వెక్కిళ్ళు రాకుండా నూ ,పోరమారకుండానూ (పులమారటం)   జాగ్రత్త పడాలి . లేకపోతె పంచదార పలుకు వూపిరితిట్టుల్లోకి పోయి తిప్పలు పెట్టె ప్రమాదం వుంటుంది. 
మరో చిట్కాతో మరో సారి.
    
పాపం!!! రంగారెడ్డి జిల్లా  మరియూ ప్రజలూ
(రాజేంద్రనగారుకు పోవాల్నంటనే )
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:16- 06 -2009.
 
 
ఆ రోజున ఏదైనా  రాజకీయ ప్రయోజనాన్నే ఆశించి చేసాడో, లేక ఎ మహత్తర ప్రజా ప్రయోజనాన్ని వూహించాడో   కాని , భాగ్యనగరానికి  ఓ రక్షణ వలయంగా  ఓ జిల్లానే సృష్టించాడో మహా రాజనీతిగ్నుడైన ఆ  ముఖ్యమంత్రి గారు. డా. మర్రి చెన్నా రెడ్డి   గారు ,అధికార బలం వున్నదన్న దన్నుతో సృష్టించిన ఆ జిల్లా , తమ మామగారైన వెంకట రంగారెడ్డి గారి పేరు పై ఆయన జ్ఞాపకార్ధం   సృష్టించిన జిల్లా. అదే రంగారెడ్డి జిల్లా.నైసర్గికంగా విచిత్రమైన రూపుతో ,హైదరాబాద్ జిల్లాలోని అంచుల్లో చుట్టూ వున్న కొన్ని గ్రామాలూ హైదరాబాద్ జిల్లా చుట్టూరా వున్న  వున్న జిల్లాలు ,కరీం నగర్,  నల్గొండ ,మెదక్, మహబూబ్ నగరు ల నుండి కొన్ని గ్రామాలు  విడ దీసి  రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేసారు. రంగారెడ్డి వంటి మహనీయుని పేరుతొ జిల్లా ఏర్పాటు చేయాలంటే ఈ విచిత్ర రూపుతో రూపొందించాల్సిన అవసరంలేదు. చక్కటి లంబకోనాలతో చతురస్రాకారంలో,ఆయన అనుకున్న జిల్లాను సృష్టించుకోగల సమర్ధుడు. . కానీ మరి అచ్చం యిలాగే జిల్లా ఏర్పడాలని ఎందుకనుకున్నాడో ఏమో ,అదో అంతుబట్టని విషయం.    
 
జిల్లాలో జిల్లా కేంద్రం లేదు. జిల్లా అధికారి కార్యాలయమూ లేదు. ఒక వేళ వున్నా పాలనా సౌలభ్యం వుండదు.
జిల్లా కేంద్రం వేరే జిల్లాలో, రక్షణ వ్యవస్థ కూడా పాపం వేరే జిల్లానే భరిస్తోంది .యిలా అన్ని పాలనా విభాగాలూ పాపం వేరే జిల్లాలోనే. మరి జిల్లాలో  ఒక ప్రాంతంలో పెడితే మరో ప్రాంత జిల్లా వాసులకు అందనంత దూరం. పరిపాలనా సౌలభ్యం మ్రుగ్యమౌతుంది. ఎవరూ ఆ జిల్లాని ఏర్పాటు చేయమని ఆశించింది లేదు ,వుద్యమాలు చేసిందీ లేదు, తనకు  అధికారం వుంది కాబట్టి ,తనను అధిష్టానం ఆదరిస్తోంది కాబట్టి ,తా బట్టిన కుందేలు చందంగా ,చేసిన అనాలోచిత చర్యలా అనిపిస్తుంది సామాన్యునికి . అసామాన్యుల ఆలోచనలేలా వున్నాయో మరి.
 
ఓ బండ రాయి చుట్టూ చుట్టుకొన్న కొండచిలువ రీతి, ఓ చట్రంలా, ఓ బండి చక్రంలా ,తన తోక తానె  మింగుతున్న కొండ చిలువలా ,తలా తోకా వున్నా కనపడకుండా
…..,గుండె ను ఎక్కడో పెట్టి ఊపిరి తిత్తులు కాలేయం కిడ్నీలు మెదడూ వేరు వేరు ప్రాంతాల్లో వుంచి , ఆ జిల్లాకు ఆ జిల్లాలో తన స్వంత అధికార గణం , అధికార ప్రాంగణ మంటూ లేక ……యిన్ని దశాబ్దాలూ నిశ్సబ్దంగా తన వునికిని ,  కాపాడుకొంటూ వచ్చిన జిల్లాకు,ఓ రూపును ఆస్తిత్వాన్ని యిద్దామని ఏ ప్రభుత్వమూ ప్రయత్నించా లేదు. తవ్వితే తలకేత్తుకోవలసి వస్తుందని  ,జిల్లా పాలనా సౌలభ్యం కొఱకు జిల్లా రూపు రేఖలను సరిదిద్దుదామని ఎటువంటి ప్రయత్నమూ చేయలేదంటే ,  ఆ రాజనీతిగ్నుని రచనా సంవిధానం …. ఎలా విశ్లేషించాలి …ఏమని చెప్పాలి.
 
” మరి మర్రి వారి అట్లా చేస్తే ,యిప్పటి C .M  సారూ చెల్లెమ్మ కళ్ళల్ల సంతోషం కనులార సూడాల్ననుకున్న డో ,లేక సేల్లెమ్మే ఆసపడిందో  ఏమో గాని …..,పత్రికల్ల వార్తలొచ్చినయ్,సేల్లెమ్మ జిల్లా కేంద్రం   రాజేంద్రనగరుకు ఎగరేసుకేల్లుద్దని …..మిగిలిన ప్రాంతపోల్లకు    ఎంత కట్టమోచ్చే ..” 
 
. ఏదో ఇప్పటిదాకా తన శరీరం లోనుంచి    విడివడిన తునకాయే    కష్టమైనా ఆప్యాయంగా సాకింది హైదరాబాద్ జిల్లా.  రంగా రెడ్డి జిల్లాలో ఏ మూలున్నా హైదరాబాదు లో  జిల్లా పరిపాలనా శాఖలు అన్నీ   అందుబాటులో వుండేవి. 
మరిప్పుడో ఓ ప్రాంతంలో జిల్లా కేంద్రం వుంటే మరో ప్రాంతానికి బహుదూరం  మరి.రాజకీయ దురంధరులేందరో లెక్కకు మించి వున్నారు .నా ఆలోచనలేపాటని ? పాడనా తెలుగు పాటా  ….
 
అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ,పరిపాలనా సౌలభ్యం కొఱకు ,ప్రజల సౌకర్యం కొఱకు ,గ్రేటర్ హైదరాబాద్ పరిధుల కావల మిగిలిన రంగారెడ్డి జిల్లా భాగాలను నాలుగు వృత్త చాపాలుగా కత్తిరించి  ఆయా ప్రాంతాలకు వెలుపల వున్నజిల్లాలు నల్గొండ ,మెదక్, మహబూబ్ నగరు,, కరీం నగర్  జిల్లాల్లో విలీనం చేయటమొక్కటే ప్రత్యామ్న్యాయ పరిష్కార మార్గం.  న్యాయంగా ఆయా జిల్లాల  శరీరాల నుంచి  కత్తిరించిన భాగాలను తిరిగి అతికించడం న్యాయం కూడా.
 
అలా కాదని జిల్లా ప్రస్తుత రూపాన్ని అలాగే వుంచి జిల్లా కేంద్రాన్ని ఇతర ప్రధాన పరిపాలనా కేంద్ర కార్యాలయాలను ఎక్కడ ఎర్పరచినా,ప్రజలకు ,అధికారులకు మితిమీరిన అసౌకర్యం కలిగి విభజనకు వుద్యమాలు తప్పని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వుంది.   
మహాకవి శ్రీ శ్రీ విరచిత “ భిక్షువర్షీయసి …..”ఆగష్టు ,౦౩ ,1934 వ సంవత్సరంలోనె ఆయన వీక్షించగలిగిన సామాజిక దృక్కోణం,  మౌన రోదనతో ఆయన  ఎద కనలి కమిలి  మూలిగినా , …..
సమాజపు దృక్కోణంలో…  మాత్రం అదో పెద్ద ఆలోచించవలసిన,ఆలోచనకొరకు తమ సమయాన్నివెచ్చించ  వలసినంత  ప్రాముఖ్యత లేని దృశ్యం .   అట్లాంటి దృశ్యాలను అనేక లక్షలమంది ప్రతిదినం చూస్తూనే వున్నా, ఈసడిస్తూ చీత్కరిస్తూనే వున్నా , ….
 
ఆ దృశ్యం నుంచి మానవీయ కోణాన్ని ఆవిష్కరిచగలగడం ,సామాజిక నిర్లక్ష్యపు కోణాలను స్ప్రుసించ గలగడం , క్రుళ్ళి కృశించి నసిస్తున్న  మానవత్వ విలువల దుర్వాసనలు సమాజంలో బ్రతుకులీడుస్తున్న మానవ జీవార్నవం మూర్కొనేలా చేయగలగడం, ఆ కంపు ఏమాత్రం లేని ఇంపైన సమాజాన్ని  ఆవిష్కరించుకొనే  దిశలో పయనించమని  చెప్పకనే తెలియజెప్పి ,నికృష్ట మానవాధమా నీవు బ్రతకడమే కాదురా,  తోటి అన్నార్తుని కానరా, వినరా, ఆద రించారా ,కలోగంజో నీకున్న దాంట్లోనే యింతైనా  పంచుకోరా అని  సమ సమాజ జీవన మార్గాన్ని చూపుతూ నిన్ను చివాట్లు పెడుతూనే ,   జీవార్నవాన మానవ జీవితాన అంతరాలను  వెలికి తీసి సమాజాన్ని కలం పోటుతో నివ్వెరపరచి ఆలోచింప చేయ గలగడం ,ఎవరు మాత్రం చేయ గలరు ఒక్క శ్రీ శ్రీ తప్ప ?   అందుకే ఆయన ఏకైక  ఆధునిక మహా కవి .ఆయన విరచించిన  భిక్షువర్షీయసి మనం మననం చేసుకుందాం .( మహాప్రస్థాన ప్రచురణ కర్తలు… విశాలాంధ్ర పబ్లిషర్స్ వారికి క్షమార్ధనతో )
 
 
మహాకవి శ్రీ శ్రీ విరచిత
     భిక్షువర్షీయసి
      (  మీ కోసం )
దారి ప్రక్క,చెట్టు క్రింద
ఆరిన కుంపటి విధాన
 కూర్చున్నది ముసిల్దొకతె
మూలుగుతూ ,ముసురుతున్న 
ఈగలతో వేగలేక .
 
ముగ్గుబుట్ట  వంటి తలా ,
ముడతలు తేరిన దేహం , 
కాంతి లేని గాజు కళ్ళు, 
తనకన్నా శవం నయం . 
 
పడిపోయెను జబ్బు చేసి ,
అడుక్కొనే శక్తి లేదు ;
రానున్నది చలికాలం ;
దిక్కులేని దీనురాలు .
 
ఏళ్ళు ముదిరి, కీళ్ళు కదలి,
బతుకంటే కోర్కె సడలి –
పక్కనున్న బండరాయి
పగిదిగనే పడివున్నది .
 
“ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి” దని  
వెర్రిగాలి  ప్రశ్నిస్తూ
వెళిపోయింది !
 
ఎముక ముక్క కొరుక్కుంటు
ఏమీ అనలేదు కుక్క 
ఒక ఈగను పడవేసుకు 
తొందరగా తొలగె తొండ.
 
క్రమ్మె    చిమ్మ చీకట్లూ, 
దుమ్మురేగేనంతలోన ,
“ఇది నా పాపం కా” దనె
ఎగిరి వచ్చి ఎంగిలాకు .       
 
 
చావులకు వేదికైన చారిత్రిక చార్మినారు
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:12-06-2009 
 
చారిత్రిక చార్మినారు
చంపడానికో వేదిక
చావడానికో వేదిక
అయినా ఫరవాలేదన్నట్లు
మరో రీతిలో జనాభా
నియంత్రణ కు మరో మార్గం
దొరికిన్దన్నట్లు
భాగ్య నగర పాలక వర్గ 
 పాలనా రీతులకో  మరో దర్పణం.
 
హత్యలు
హతులూ
హంతకులూ
అనునిత్యం వార్తా శీర్షికలై 
విరాజిల్లుతున్నా నిరంతరం  
 
కానీ  ఏదీ ఎక్కడ
ఆ అనుభవాల పాఠాలు  
ఆకళింపు చేసుకొన్న
 దాఖలాలేవీ  
ఆ నికృష్ట చర్యలకు
 ఆచరణలో
అడ్డుకట్టలేవీ
 
పటిష్ట యోజన
సిద్ధం చేద్దామని
యోచనలే చేయని
సంకల్ప రాహిత్య
ప్రభుత్వాలు ఓ ప్రక్క 
నిర్లక్ష్య  పాలనా యంత్రాంగాలు 
మరో   ప్రక్క
 
హత్య అయినా ఆత్మ హత్య అయినా
నిత్యక్రుత్య జనజీవన సంవిధాన
సహజ సిద్ధ ప్రక్రియ
అన్నట్లు 
నాగరీక జన సందోహాలు.
ఏమీ జరగనట్లు
చీమో దోమో కుట్టినట్లు
ఎ  ఆందోళనా  లేకుండా 
ఎ ఆందోళన లూ  చేయకుండా 
 మళ్ళీ
చార్మినారు ఎక్కుతూనే వున్నారు.
 
రక్షక భట వర్గాలు
నిత్య కృత్య బక్ష ణా   క్రుత్యంలో 
తాదాత్మ్యం లో   తలమునకలై
పాపం
వారూ చేయగలిగిందేముందని
చస్తున్నా చూస్తూ
చంపుతున్నా చూస్తూ
మరో ఘటనకొరకు ఎదురు చూస్తూ
వివిధ మీడియా ప్రతినిధులు.
చంపిన వాడు దొరికినా
చంప బడిన వాళ్ళు చచ్చినా 
జరిగేదేమీలేదుఒరిగేదసలె లేదు. . 
సంఘటనలు ఆగేదీ లేదు. 
వివిధ మీడియాలకు  మరో   వారం 
వార్తలు దొరకటం తప్ప. 
 
 
స్వయంకృతాపరాధం

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

తేది: 10-06-2009.
 
 
సృష్టి కర్తే సృష్టించాడో
కోట్లాది కోట్ల వత్సరాల  
నిరంతర పయనంలో 
సూర్యుని కోపాన్ని 
తట్టుకొనే నెపంతో 
ధాత్రి 
తనకు తానె నిర్మించుకొందో ! 
ఆ రక్షిత రక్షణ వలయం
తూట్లు తూట్లు పడుతోంది !!!
 
అతి  నీలిలోహిత
కిరణ పుంజం 
ఆ తూట్ల గుండా
ధరిత్రి పై దాపురిస్తే !!!
వికృత మానవ రూపాల్
దుష్కృత జీవశ్చవాల్
వినాశనం
అతి వికృత
జీవావరణ విధ్వంసం !!!
జీవ హనన సంవిధాన
 రచనా విధాత  
ఎవరు ఎవరు ఎవరు !!!
ఇంకెవరూ   మానవుడే —-
పోస్టు చేయని వుత్తరం-3
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది: 08-06-2009
 
చిట్టీ,
ఇక్కడ మేమంతా క్షేమమే . నీ విషయాలు మొన్నటి నీ ఫోను తో తెలిసాయి , మొదటి సెమిస్టరులో ఏ బ్యాక్ లాగ్ లు లేకుండా పూర్తీ చేసుకున్నందుకు చాల సంతోషం. ఆ మధ్య నీవు వచ్చి నప్పుడు   మా ఆనందానికి
అంతులేదు. గాలిలేని కొట్లో నుంచి విడుదలై గుండె నిండా ఆక్సిజెన్ పీల్చుకున్నట్లుంది నిన్ను చూసినప్పటి మా పరిస్తితి. ఎంత చిక్కిపోయావు ? ఇప్పుడు మిక్కీ కూడా తిండి బాగానే తింటోంది .పాపం పిచ్చి ముండ నీ మీద బెంగ పెట్టుకున్నట్లుంది. మూగ జీవి చెప్పుకో లేదుగా.  దాన్ని ఎవరైనా కుక్క అంటే మాత్రం ( అది కుక్కే అనుకో ) నాకు చిర్రెత్తుకొస్తుంది.  అది సరే ,పిల్లలు కూడా ఎంత సంబర పడిపోయారో చూసావుగా.
ఇక పొతే ఇంతకు ముందు నీకు  రాసిన వుత్తరం లో మనలను మనం ఎక్ష్ప్రెస్స్ చేసుకోవడం గురించి వ్రాసాను. దాని గురించి ఇప్పుడు విపులంగా చర్చించుకొందాం.
మనలను మనం ,మన భావాలను మనం వ్యక్త పరచేతప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాల అవసరం. మనం ఎ రీతిలో మనలను వ్యక్తప్రచుకొంటున్నా అవెప్పుడూ దాంబికాలుగా కనపడగూడదు.అట్లాగని మనలను మనం తక్కువ చేసుకొనే ప్రయత్నం ఎప్పుడూ చేయ కూడదు. అవతలి వ్యక్తీ ఆసక్తి చూపే విధంగా నీ వ్యక్తీకరణ వుండాలి. ఆ వ్యక్తీకరణ తో ఎదుటివారు స్ఫూర్తి పొందాలి. ఎ సందర్భంలోనూ ఎదుటివారిని కించ పరచ గూడదు.
మనం చెప్పాలనుకున్నది ఎ తడబాతూ లేకుండా నిర్భయంగా నిర్దిష్టంగా సున్నితంగా వినయంగా చెప్పాలి.
 అంతే కాకుండా ఇతరులకు నిన్ను నీవు ఎ విధంగా వ్యక్త పరచావో  అదే విధంగా ఇతరులను అర్ధం చేసుకో  వాలన్నా , ఆకళింపు చేసుకోవాలన్నా ముందు అతను చెప్పేది శ్రద్ధగా పూర్తిగా వినాలి. అతను చెప్పేదాంట్లో సారం ఏమీ లేదనుకున్నప్పుడు ,సున్నితంగా చెప్పి తప్పుకోవాలికానీ ,అతని ముందు బయట పడకూడదు. మనం ఎస్కేప్ అవుతున్నామని అతనికి అర్ధం అవుతుంది కాని మన నోటితో మనం ఆ విషయాన్ని వ్యక్త పరచ కూడదు.
ఇది పెద్ద పెద్ద బిజినెస్స్ మెన్ రాజకీయ నాయకులు ,ఎక్జిక్యూటివ్ లు   వాడే టెక్నిక్. సాధ్యమైనంత తక్కువ మాట్లాడి ,అవసరానికి మించి విషయాన్ని యితరుల నుంచి రాబట్టటం ఒక ఆర్టు. మనం బయట పడకుండా ఎదుటివాడిని బయటకు రప్పించడం రాజకీయాల్లో ఓ ఎత్తుగడ.
ఇప్పటి వుంటాము  నాన్నా. ……ఆరోగ్యం జాగ్రత్త. శుభ్రంగా తిను. వుంటాము……అమ్మ నాన్న.
పోస్టు చేయని వుత్తరం -2
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :07-06-౨౦౦౯
 
డియర్ చిట్టీ ,
ఇక్కడ మేమంతా బాగానే వున్నాం .నీ గురించే  మా బెంగ. చాలా రోజులైనట్లుంది నిన్ను చూసి. మొన్నటి నీ ఫోను సంభాషణ తరువాత మీ అమ్మ కు బెంగ  మరీ ఎక్కువయ్యింది. నీ వద్దకు వెళ్లి వద్దామని వత్తిడి చేస్తోంది.
ఇక పొతే నీకు కొన్ని విషయాలు చెప్పాలి.
ఏమనిషయినా ఈ సమాజంలో ఒంటరిగా వుండలేడు. ఒక వేళ నీవు వుండ   గలిగినా సమాజం వుండ నీయదు. ,హర్షించదు. అందు చేత సాధ్యమైనంత వరకు మనం మన వ్యక్తిత్వాన్ని నిర్మించు కుంటూనే ,తోటి వారితో కలిసిపోతుండాలి. వారి సహకారం తీసుకొంటూ ఉండాలి   .వారికి అవసరమైనప్పుడు   మన సహకారమూ    అందించాలి .మంచి స్నేహితుల్ని పెంపొందించుకోవాలి. నీ మంచితనాన్ని ,నీ ఆప్యాయతను  అపార్ధం చేసుకొని అతిగా ప్రవర్తించాలనుకొనే వాళ్ళను ఆదిలోనే గుర్తించి దూరంగా వుంచడం  అలవారుచుకోవాలి. ఈ సమాజం ఓ అడవి లాటిది .జనారణ్యం.  సాధు జంతువులూ వుంటాయి, క్రూర మృగాలూ వుంటాయి . వ్యత్యాసాలు గుర్తించడం కొంచెం కష్టమే అయినా కాలక్రమేణా నీ అంతట నీవే గుర్తిస్తావు. ఒకరితో నాకేమని నీవు ఒంటరివైపోకు. నాకు వున్నదేదో తింటాను ఇతరులతో నాకేమి పని అని భావించడం …కొంత కాలమైతే ఫరవాలేదు గానీ ,
కాలక్రమేణా నీకు అవసరమైనప్పుడు నీ సహాయానికి ఎవరూ రారు అని నీవే గుర్తిస్తావు. . మనం, మన వ్యక్తిత్వం ఎంత ఘనమైనా ,సమాజంలో మేసలుతుంటేనే ,అన్ని సందర్భాలలో నీ వునికిని  నీదైన శైలిలో చాటుకుంటేనే ,కంపారిజన్ లో నీ వేమిటని నలుగురికీ తెలుస్తూంది. మనకూ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అందుకే మనలను మనం ఏమిటని నలుగురికీ చాటింపు వేయనక్కరలేదు కాని ,మనమేమిటో వ్యక్తపరచుకోవాల్సిన అవసరం  ఎంతయినా వుంది. ,మనకున్న ప్రతిభా పాటవాలు తెలియజేప్పుకోగల అవకాశాలు వచ్చినప్పుడు వెనకంజ వేయకుండా ముందుకు దూకడం , నిరూపించుకోవడం చాలా అవసరం. గెలుపూ ఓటమిల గురించి ఆలోచించకుండా పోటీలో పాలు పంచుకోవడం ఓ గొప్ప ప్రక్రియ. ఏ వ్యక్తికైనా. తనను తాను  వ్యక్తపరచు కోవడం గొప్ప కళ .మరో లేఖలో మరి కొన్ని విషయాలు. అమ్మ నాన్నలు చెప్పేవి ఏవీ అనుచితాలు కావు. అర్ధం చేసుకుంటే అనర్ధాలే రావు.  
 నీ జాగ్రత్తలు నీవే తీసుకోవాలి. ఇప్పటికి  వుంటాము నాన్నా,ఆశీస్సులతో ……నీ అమ్మ నాన్న

 

భాగ్య నగరంలో  జనాభా నియంత్రణ                                                                                                         
                   కో   
            కొంగ్రొత్త పథకం  
 
       రచన : నూతక్కి రాఘవేంద్ర రావు   
             తేది :06-06-2009   
                (   part-1   )                                                                                           
    స్వాగాతిస్తావో చీత్కరిస్తావో నీ యిష్టం   …  
             మనిషి  శరీరాన 
             మైళ్ళ పర్యంతం
        హృదయ కవాటాల ద్వారా 
          పరిశుద్ధిత  రుధిరాన్ని 
  శరీరపు  అణువు అణువు కు  అందిస్తూ … 
               చెడు రక్తాన్ని
         గుండెకు తిరిగి చేరుస్తూ
            మానవ జీవ జాల
    యంత్రాంగాన్ని  నియంత్రిస్తూ   
                ధమనులు    
                  సిరలు
     ప్రక్క ప్రక్కనే పయనిస్తున్నా
    చెడునూ మంచినీ కలపకుండా
                  కానీ
   మురుగు    కాలవల నీళ్ళ పైపులతో 
    జనాభా నియంత్రణా పారించారు
 మంచి నీళ్లకూ మురుగు జలాలకు 
  అన్యోన్య సామ్పత్యాన్ని పెంపొందించారు  
భాగ్య నగరి జల సరఫరా మురుగు అధికారులు  
              

తర్వాత పేజీ »