గడసరి మొగుడు
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:10-08-2009
తను వింటుండగా …
ఆనాడు మల్లె పొద కాడ…
పెళ్ళికి ముందు
ఆమె వడిల పండి సెప్పిండు
నీ అధరాలు గులాబీ పూ రెమ్మలు…..
తానె వింటుండగా
పెళ్లి తరువాత ఆమెకే …..
పడకటింటి మంచంల
పండి సెప్పిండు
నీ పెదాలు మొగలి పూ రేకులు ‘
పోగిడిండా ? తెగిడిండా ?’
నాగ్గిట్ల సమఝ్ కాలే ….
తనకెందుకు లెమ్మని
తెమ్మెర తరలి పోయే
బుల్లి తెరపై బుడి బుడి నడకల గాంధర్వులు
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది: 07-08-09
సమయం :23- 00 గం.
తెలుగు చిత్ర సీమ చిరు చిరు అడుగులనుంచి అందాల నడకలు నేర్చి హృద్యంగా నర్తిస్తూ యిప్పటికి ఎన్ని దశాబ్దాలు గడిచాయో గాని, హీరోలు హీరోయిన్లు , యితర యాక్టర్లు ,వెండి తెరపై కనుపించే వారు తప్ప, తెరవెనుక పనిచేసే సాంకేతిక ప్రముఖులు గాని , దర్శకులు గాని ,ఎడిటర్లు గాని ,గాయకులూ ,సంగీత దర్శకులు గత కొన్ని సంవత్సరాల వరకు ప్రజలకు తెలిసే వారు కాదు.మీ ప్రక్కనే వారు నడుస్తున్నా ,మీరు మాట్లాడుతున్నా గుర్తు పట్టే అవకాశం వుండేది కాదు. అదే హీరో పాత్ర దారులైనా , హీరోయిన్ పాత్రదారులైనా ,హాస్యపాత్రదారులైనా ,విలన్ పాత్ర దారులైనా ప్రజల మనసుల్లోకి చొచ్చుకు పోయే అవకాశాలు ఎక్కువగా వుండేవి. సినీ పత్రికలు కూడా వారికి గొప్ప ప్రచారాన్ని యిచ్చి అతి గొప్ప ప్రాచుర్యాన్ని కలిగించేవి . అనేక వ్యయ ప్రయాసలకోర్చి చిత్ర నిర్మాణానికి ధనం వెచ్చించి అనేక సాధక బాధకాలు ఎదుర్కొని చిత్రాలు నిర్మించే నిర్మాతలకు , కధా రచియితలకు ,చిత్రానికి ఓ రూపునిచ్చి సొగసులు అద్దె దర్శకులకు ,యితర సాంకేతిక నిపుణులకు కూడా తగిన ఆదరణ పత్రికా మాద్యమం యిచ్చేది కాదు. . వారి ముఖ చిత్రాలు కూడా అంతగా ప్రచురించే వారు కాదు. . వారిని ప్రాచుర్యంలోకి తేవాలని ప్రయత్నించే వారు కూడా కాదు. శ్రీ బి యెన్ రెడ్డి గారు , ఆదుర్తి సుబ్బా రావు గారు ,,బాపు వంటి అధునాతన ప్రతిభా శీలురు దర్శక రంగంలోనూ, ఘంట సాల వారు ,( , తమ ప్రియతమ నేపధ్య గాయకుణ్ణి వెంకటేశ్వర మహత్యం సినిమాలో లో చూసే అవకాశం ప్రేక్షకులకు మొదటి సారి కలిగింది.) జానకి ,సుశీల, వంటి నేపధ్య గాయనీ గాయకులు . అన్ని అడ్డంకులను దాటి తమ వునికిని చాటుకొంటూ వ్యక్తిగత ప్రతిభతో ప్రజల ముందుకు దూసుకు వచ్చారు. . ఆ సమయంలో దాసరి నారాయణ రావు గారు దర్శకుడిగా యాక్టరుగా చిత్ర రంగ మాద్యమం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వచ్చారు. ఎస్పి బాల సుబ్రహ్మణ్యం శంకరాభరణం చిత్రం తరువాత, సినీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని గాయకుడిగా సుస్థిర స్థానం సమకూర్చు కొన్నారు. టి వి మాధ్యమం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచినా , దాని ద్వారా గత కొన్ని సంవత్సరాల నుండి మాత్రమె , చిత్ర సీమలోని తెరవెనుక ప్రముఖులను వీక్షించ గలిగే అవకాశం ప్రేక్షకులకు కలిగింది. వివిధ టి.వి చానళ్ళ మధ్య పోటీ పెరిగి వివిధ కార్యక్రమాలు రూపొందిస్తూ , గాయకులను, సంగీత కారులను ,దర్సకులనూ ,నిర్మాతలనూ, యితర సాంకేతిక కళా కారులనూ ప్రజలకు పరిచయం చేస్తూ వున్నా చెప్పుకో తగ్గంత గా మాత్రం లేదని చెప్పా వచ్చు. . చిత్ర సీమ భవిష్యత్తు ను దృష్టిలో వుంచుకొని బాలలలో వున్న గాత్ర కళా కౌశలాన్ని ,నాట్య కౌశలాన్ని వెలికి తీసే యత్నంలో గాయకులను , నృత్యకారులను, ప్రోత్సహించే దిశగా కోన సాగుతోంది బుల్లి తెర . ప్రతి యింట జీవిత భాగాస్వామిలా కలిసిపోయిన బుల్లి తెర , యువతలో వివిధ కళా కౌసల్యాలను మాత్రమె కాక తెలుగు భాష పై ఆసక్తి నీ పెంపొందిస్తోంది.,శాస్త్రీయంగా కళను నేర్చుకోవాలనే దృక్ఫదం తల్లి దండ్రులలోనూ పిల్లలలోనూ పెరుగుతోంది. భాషపై పట్టు కూడా పెరుగుతోంది. ఆ విధంగా తెలుగు భాష బ్రతికి బట్ట కట్టే దిశగా ఎదుగుతోంది .నూతన గాయకులు , నృత్య కారులు బాల్య దశ నుండే ఆసక్తిని చూపిస్తూ ,అంతటి చిన్న వయసులో ఎంతటి ఘనమైన ప్రజ్ఞను ప్రదర్సిస్తున్నారో వీక్షిస్తే…. ఆ కార్యక్రమాలు వీక్షించే యువతలో , బాల బాలికలలో తెలుగు పై ఆసక్తి పెరుగుతోంది. వారికి కావలిసింది యిసుమంత ప్రోత్సాహం ,తగినంత మార్గ నిర్దేశకత్వం. వీరంతా గొప్ప ధనవంతుల యిళ్ళ నుండి వస్తున్నా వారు కాదు. tamaku కు లభించే ప్రతిపైసా జాగ్రత్తగా ప్రణాలికా బద్దంగా ఖర్చు చేస్తూ తమ పిల్లలలో వున్న సామర్ధ్యాలను వెలికి తీయాలనే తపనతో తాము…. జీవితంలో పోదాలిసినవి ఎంతో కోల్పోతూ కూడా తమ పిల్లల జీవితాలకు పూల బాట పరవాలనే యత్నంలో ……తల్లి దండ్రులు. యిది చాల ముదావహమైన విషయమే. ఆంగ్ల మాద్యమం లో చదవడం వల్ల ఈ కార్యక్రమాలు చూస్తూ మాత్రు భాషలోని మాధుర్యాన్ని పొందలేక పోయామని భావిస్తూ తెలుగు భాష నేర్చుకునే దిశలో ముందుకు కదులుతున్న యువత ను చూసి దానికి ప్రోద్బలం అందించిన బుల్లి తెర ను (వివిధ టి.వి చానళ్ళ ను) అభినందించకుండా వుండ లేము. అభినందించి దానితో సరిపెడితే చాల పొరబాటు. . ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో తమ వంతు తోడ్పాటు నందిన్చాల్సిన అవసరం ఎంతయినా వుంది . ముఖ్యంగా తల్లిదండ్రులూ బంధువులూ సరైన సమయంలో తమ పిల్లలలోని కళా తృష్ణను గుర్తించి సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి చేసే దిశలో వారిలో ఆశావహ దృక్పధాన్నినింపుతూ నెగటివ్ థాట్స్ ను తరిమేస్తూ కడలి ముందుకు అడుగు వేస్తె , తెలుగు జాతిలో కళాత్మకత వెళ్లి విరిసి సమాజాన్ని పట్టి పీడిస్తున్న కక్ష ద్వేషం పగ ఈర్ష్య అసూయ ,కుట్ర, కుతంత్రం, తమ దరి చేరనీయని నవ యువతరంగాన్ని మనం ఆవాహన చేసుకోగలం. కానీ ఈ యత్నంలో ఒక్క గాయకులనే కాక ,వారి ప్రతిభకు వన్నె లద్దె అనేక యితర రంగాల ప్రముఖులను ,వారి వారి ప్రతిభను ప్రజలకు పరిచయం చేయ వలసిన అవసరం ,మరియు ఆయా రంగాల్లో ఔత్సాహికులను ప్రోత్సహించ వలసిన అవసరం ఎంతయినా వుంది. ఆ భాద్యతను కూడా తామే భుజానికెత్తుకొవలసిన అవసరం , భాద్యత వుందన్న విషయం బుల్లి తెర యాజమాన్యాలు మరువ గూడదు. పాట పాడేందుకు కవి రాసిన గీతం ఎంత అవసరమో ,పాడేందుకు సమర్ధుడైన గాయకుడు, ఆ గానం వీనుల విందుగా మలిచే యత్నంలో వేదిక , ఆర్కేష్ట్రా ,వాద్యాలూ వాద్యకారులూ , వారి ప్రతిభ కూడా అత్యంత ముఖ్యమైనవి .గాయకుడి ప్రతిభ వెలికి రావాలన్నా వన్నెలు దిద్డుకోవాలన్నా వాద్యకారుల ప్రతిభ,ఆయా పరికరాల సామర్ధ్యం అతి ముఖ్యమైనది. . అదునాతన సాంకేతిక,శాస్త్ర పరిజ్ఞానం అందించిన ఎన్నో నూతన సంగీత వాద్య పరికరాలు ….వాటి ని ప్రతిభావంతంగా వినియోగించుకోనేందుకు నిపుణులైన వాద్యకారులుగా తయారు చేసే దిశగా టి.వి రంగం ముందుకు రావాలి. సంభందిత రంగాల్లోనూ పోటీలు పెట్టి నూత్న వాద్య కళా కారులకు ప్రోత్సాహాన్నందించ వలసిన అవసరం ఎంతయినా వుంది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక టి .వి చానెళ్ళలో పాటల పోటీలు జరుగుతున్నా ,వారికి అనేక ఆర్కేష్ట్రా బృందాలు వాద్య సహకారం అందిస్తున్నా , ఆయా ఆర్కేష్ట్రా సభ్యుల ప్రతిభా సామర్ధ్యాల గురించి నాలుగు ముక్కలు చెప్పడం గాని ,వారిని మెచ్చు కోవడం కాని , పాటలోఆర్కేష్ట్రా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియ చెప్పటం గాని, (ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ),నిర్వాహకులు గాని ,గానంలో, సంగీతంలో ప్రఖండులైన వారు గానీ, సముచిత ప్రాధాన్యం ఇవ్వాలన్న యోచన చేయక పోవడం శోచనీయం .. పాటను ఏ రాగంలో పాడాలో ,మ్యూజిక్ ఏవిధంగా వినియోగించాలో ,ఆర్కేష్ట్రా లో ఏ ఏ వాద్యాలు వాడాలో అందుకు ప్రతిభా వంతులేవ్వరో తెలుసుకొని వినియోగించడం ఎంత ముఖ్యమో, ….పాటలకే కాక తత్ సంభందిత సాంకేతిక రంగాలలో కూడా ప్రతిభను వెలికి తీసే ప్రక్రియను .ప్రోత్సాహాన్నందించే విధానాలను రూపొందించాలి. పాటంటూ వుండాలంటే ,ముందుగా కావలిసిన వారు రచయితలూ , కవులు , ఆర్కేష్ట్రా ,,ప్రాచీన/ నవీన వాద్యాలు , సంగీత దర్శకులు . ఆయా రంగాలకు చెందిన ప్రతిభా వంతులైన కళాకారులను ,నిష్ణాతులను , ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాక, ఔత్సాహికులనుండి వారి ప్రతిభను వెలికి తీసి భావి తరాల కొరకై అందించడం, తమ గురుతర భాద్యతగా టి .వి మాధ్యమాలు గుర్తించడం ఎంతో అవసరం. వైద్యం రంగంలో ఎన్నెన్నో శాఖలు బయటకు వచ్చి తమ వైశిష్ట్యాన్నిచాటుకుంటున్న విధంగా సినీ రంగంలో కూడా వివిధ విభాగాలు దేనికది విడివడి తమ వునికి చాటుకోవాలంటే ధృఢ తరమైన వూతం కావాలి. దానికి బుల్లి తెర వేదికగా మారాలి. యువ గాయకులను తెలుగు ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ తరుణంలో నైనా కనీసం ప్రతిభావంతులైన ఆర్కెస్ట్రా బృందాలను ప్రేక్షకులకు/శ్రోతలకు పరిచయం చేయడం బుల్లితెర యాజమాన్యాలు ఆనవాయితీగా పెట్టుకో వలసిన అవసరం ఎంతైనా వుంది.. ఆయా బుల్లి తెర ల లో పిల్లల చే చేయించే పాటల కార్యక్రమాలలో పిల్లలు పాడిన ప్రతి పాట తరువాత ప్రత్యెక అతిధి ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ అభినందిచే అవకాశం వున్నా ఆ యా అతిధులు ఆయా బాల గాయకులకు సరి అయిన రీతిలో .అభినందనలు అందించలేక పోతున్నారు. . ఆ ప్రత్యెక అతిధి బాలగాయకుల మనసులు గాయపడని రీతిలో ఆ పాటను అభినందించడమో, లేక ప్రతిభను అభివ్రుది పరుచుకునేందుకు సూచనలు చేయడమో చేస్తే బాగుంటుంది. ఈ ప్రక్రియ కై ప్రత్యెక వ్యూహ రచన చేసి నిర్మాణాత్మకంగా వ్యవహరించి కార్య సాధన దిశగా పయనించ గల శక్తి యుక్తి టి .వి మీడియా కు మాత్రమె సమృద్ధిగా వుందని భావిస్తూ . వారి ప్రస్తుత నిబద్ధతను ప్రశంసిస్తూ , భవితలో మరింత ఆశిస్తూ . ,శలవు తీసుకుంటూ….
కృష్ణకాంత్ పార్కులో విరిసిన సాహితీ సుమాలు . నా జ్ఞాపకాల వింజామర లూ …
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
మొత్తానికి ఆ రోజు అదే 14-06-2009 శ్రీ సి. బి రావు గారి పుణ్యమా అని, కొంగ్రొత్త సౌరభాల తో తెలుగున విరిసిన సాహితీ సుమాలను కృష్ణకాంత్ పార్కులో ఆ సమయంలోఅతి దగ్గరగా వీక్షించి ఆ సౌరభాలను ఆఘ్రాణి స్తూ ….. …. గతంలోకి అలా అలా …….
.
నిజంగా ఆ రోజు నేను … ఎక్కడెక్కడికో గత కాలపు తీరాలు చేరి …..కాల చక్రం వదిలిన జాడల వెంట పరిగిడిపోతూ …
…. 1963 -1965 మధ్య తెనాలి లో సాగిన నా సాహితీ యానం, పలువురు ప్రముఖ కవులు కొండూరు వీర రాఘవా చార్యుల వారు, ప్రముఖ నవలా రచయితలూ, భావుకులు ,శ్రీ తాళ్ళూరు నాగేశ్వర రావు గారు ,శ్రీ హితశ్రీ గారు, వారితో మహోదయా ప్రింటర్స్ కార్యాలయంలో సన్నిహితంగా మెసిలిన సాహితీ సంగమాలే కాక . . నేను వ్రాసిన బుర్రకథ ‘చైనా దురాక్రమణ ఆవిష్కరణ సందర్బంగా వారంతా ముద్రణా కార్యాలయానికి విచ్చేసి నన్ను ప్రోత్సహించడం మరీ మరీ నాకు గుర్తుకు వచ్చాయి. తెనాలిలో నేనూ ,నా ప్రియ మిత్రులు వెనిగళ్ళ వెంకట రత్నం ,బెనర్జీ మిగతా మా గ్రూపు విద్యార్థులు పాలుగొన్న విద్యార్ధి వుద్యమాలూ….గుర్తుకు వచ్చాయి .
1966-1968 మధ్య కాలంలో నేనూ నా మరో ప్రియ మిత్రుడు సహచరుడు జి. రామ మూర్తి ,మిగతా మిత్ర బృందం కలసి కొత్తగూడెంలో చేపట్టిన విశాఖ వుక్కు ఆంధ్రుల హక్కు వుద్యమం, గుర్తుకు వచ్చింది. ఆ వెనువెంటనే,ఆనతి కాలంలోనే స్తానిక నిరుద్యోగులకు…. క్రొత్తగా నిర్మిస్తున్న కే. టి. పి. ఎస్ లోనూ , బొగ్గు గనుల లోనూ ,వుద్యోగ నియామకాల్లో జరుగుతున్న అన్యాం పై గళమెత్తి స్థానికులకు మాత్రమె ఆ యా సంస్తలలో వుద్యోగాలు కల్పించాలని , కొత్తగూడెం విద్యార్ధి పరిషత్ కార్య నిర్వాహక సభ్యులుగా విద్యార్ధి వుద్యమాలు చేపట్టడం , ఆ తరువాత అప్పటి కేంద్ర గనులు వుక్కు మంత్రి శ్రీ చెన్నారెడ్డి గారిని కలిసి ఆయన సలహా మేరకు ,వుస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ళలో విద్యార్ధి సంఘాలను కలిసి విద్యార్ధి లోకాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య , స్థానికులకు జరుగుతున్న అన్యాయాం,సింగరేణిలో,కే టి పి ఎస్ ల లో రాష్ట్రేతరులు తన్నుకు పోతున్న వుద్యోగాలు …అలా అనేక సమస్యల గురించి చర్చించి యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలే ఆ కార్యక్రమాలు చేపట్టాలని ,మా వంతు తోడ్పాటు వుంటుందని చెప్పి ,మేము ప్రారంభించిన వుద్యమం అతి కొద్ది కాలంలోనే ఏ ఏ రూపులు సంతరించుకొని ఏ తీరున వుద్రుతి చెంది ప్రవహించి 1969 కాలానికి ప్రత్యెక తెలంగాణా సాధనోద్యమంగా రూపాంతరం చెంది ఎన్నెన్ని జీవితాలను కుటుంబాలను అతలా కుతలం చేసిందో ,గుర్తుకు వచ్చాయి.
ఆ తరువాత 1972-1975 మధ్య కాలంలో హైదరాబాద్ లో నారాయణ గుడా లో ప్రముఖ చిత్రకారులు శ్రీ పి.టి రెడ్డి గారి యింట శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారి వంటి మహా మహుల సమక్షంలో శ్రీయుతులు ఇన్నయ్య గారు, శ్రీ సి బి రావుగారు, శ్రీ వెనిగళ్ళ వెంకట రత్నం మొ:వారు ,నిర్వహించిన నెల నేలా సమావేశాల లో నేను పాలుపంచుకున్న రోజులు గుర్తు కొచ్చాయి. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో సభ్యుడిగా అప్పటి కే పేరుగాంచిన చిత్రకారులు శ్రీ పి.టి రెడ్డి ,మొదలైన ప్రముఖ చిత్ర కారులతో ముఖా ముఖి చర్చల్లో పాలు పంచుకోవడం ,నా చిత్రాలు కూడా వారి చిత్రాల సరసన ప్రదర్శనకు నోచుకోవడం కూడా గుర్తుకొచ్చింది.
ఆ తదుపరి కాలంలో ( 1970-1975 మధ్య కాలంలో) నేను ,ముందుండి నడిపిన కార్మికోద్యమాలు ,సహకారోద్యమాలు జ్ఞాప్తికొచ్చాయి.కార్మిక సంఘ స్థాపనలో పాలు పంచుకొని వుద్యమాలను ముందుండి నడిపి ,సహకార సంఘాలు స్థాపించి మార్గ నిర్దేసకత్వం చేసి, ఇలా ఎన్నో జ్ఞాపకాలను నెమరు వేసుకొనే అవకాశం నాకు ఈ సమావేశంలో ………….తలవిదిల్చి వాస్తవానికొస్తే
శ్రీ సి.బి రావు గారు , నాకు 14-06-2009 న జరిగే ఈ తెలుగు సమావేశాలకు ఆహ్వానం మెయిల్ ద్వారా పంపారు, ఏమనంటే ఈ నెల ఈ తెలుగు సమావేశం రెండవ ఆదివారం dt. 14-06-2009 న జూబిలీ హిల్స్ లోని ఇన్నయ్య గారి శాస్త్రీయ పరిశోధనా గ్రంధాలయంలో జరుగుతుందనిన్నూ, రాగోరువారు సమ్మతి తెలియపరచగాలరనిన్నూ .అయితే కారణాంతరాలవల్ల ఆ సమావేశ వేదిక యూసుఫ్ గూడా లోని కృష్ణకాంత్ పార్కు కు మార్చబడిందని మరో మెయిల్ లో తెలియబరిచారు. నేను వస్తున్నట్లు. నా సమ్మతిని తెలియ పరచాను.
ఆ సమావేశా లకొరకు ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. ఆ సమావేశాలకు బస్సులు పట్టుకొని, ఆటోలు పట్టుకొని ఎలాగయితే నేఁ ఖస్చ్చితంగా సాయంత్రం 03-00 గం .లకు క్రిష్ట్నకాంత్ పార్కుకు కు చేరుకొని ఎంట్రీ టికెట్ తీసుకొని లోనికి ప్రవేశించాను.
.అది చాలా పెద్ద పార్కు.భవిష్యత్తులో చాలా సుందరవంతంగా తీర్చి దిద్దబడుతుందనిపించింది. అన్ని హంగులూ తీర్చిదిద్దే ప్రయత్నంలో హుడా వారున్నారనిపించింది. కాకుంటే ఎండల వేడిమి, నీటి కొరత పార్కు పచ్చ దానం మీద ఎక్కువ ప్రభావాన్నే చూపాయి. అయినా పచ్చని పెద్ద పెద్ద చెట్లు చాల విశాలమైన నీడను పచ్చని పసిరిక మైదానాలపై పరచి ఆకు పచ్చ దానం లోనే వివిధ తేడాలు ప్రస్ఫుటంగా తెలియజేస్తూ అంతటి వేడిమిలోనూ ఆహ్లాదాన్ని కలుగ జేస్తున్నాయి. అప్పటికే ఇళ్ళల్లో వేడిమి తట్టుకో లేక వ్యాహ్యాళికి వచ్చిన పెద్దలూ, యువ జంటలూ అక్కడక్కడ బెంచీలపై ముచ్చట్లాడుకొంటు న్నారు .పిల్లలు వారికొరకు ఏర్పాటు చేసిన అనేక ఆట పరికరాలతో ఆడుకొంటున్నారు. పార్కులో అప్పుడే సందడి మొదలౌతోంది.
E. తెలుగు సమావేశం ఎక్కడో ఎలా తెలుసుకోవాలి? పోయిన నెల సమావేశాల్లో సి.బి రావు గారు దీప్తిధారలో ప్రచురించిన పోయిన నెల సమావేశాల తాలూకు ఫోటోలు చూసాను. వీవెన్ గారిని గుర్తుపట్టగలను. అదీ కాక ఆయన ఆ సమావేశాలకు వస్తున్నానని ఫోనులో చెప్పారు. ఆ ధైర్యంతో ముందుకు సాగుతుంటే కొద్ది దూరంలో ఓ పెద్ద నిద్ర గన్నేరు చెట్టు నీడలో ఓ అయిదుగురు యువకులు సర్కిల్లో కూర్చొని మాట్లాడుకోవడం చూసాను. దగ్గరకు వెళ్లి పరికించి చూస్తె వీవెన్ గారు కనిపించారు. వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకొని , వారినందరినీ కూడా పరిచయం చేసుకుందును కదా అందులో బ్లాగ్లోకంలో వుద్దండులు కొందరు. అందరూ యువకులే. నేనూ ,శ్రీ దూర్వాసుల వారూ తప్ప. ఆ సమావేశంలో నేను వెళ్ళేసరికి వారు చర్చలో వున్న వారు ….
సర్వ శ్రీ ….. 1)వీవెనుడు (వీవెనుడి టెక్కు నిక్కులు ఫేం ) మరియు ఈ తెలుగు నిర్వాహకులు. 2) పద్మనాభం దూర్వాసుల …(తెలుగు గ్రీటింగ్స్ ఫేం ) మరియూ ఈ తెలుగు నిర్వాహక సభ్యులు. 3) శ్రీ కశ్యప్ (కబుర్లు ఫేం )మరియూ ఈ తెలుగు కార్య నిర్వాహక సభ్యులు. 4)శ్రీ కత్తి,మహేష్ కుమార్ …(అదే పేరుతొ కవిగా బ్లాగరు గా ఫేం ) మరియూ ఈ తెలుగు కార్య నిర్వాహక సభ్యులు. .,5)శ్రీ తుమ్మల శిరీష్ కుమార్ … ఈ తెలుగు కార్య నిర్వాక సభ్యులు (క్షమించాలి ఈ తెలుగు కార్యవర్గంలో వారి వారి అధికారిక పదవులేవో నాకు తెలియదు. ). ఆ తరువాత నేను .6)నూతక్కి. వర్డ్ ప్రెస్ .కాం బ్లాగరును. ఆ తరువాత 7) శ్రీ కశ్యప్ గారు (kaburlu.wordpress.com )వచ్చారు . ఆ తరువాత 8) శ్రీ దాట్ల శ్రీనివాస రాజు గారు .9) చివరగా శ్రీ శ్రీనివాస్ (సమీహ)( సమీహతెలుగు.బ్లాగ్స్పాట్.కాం )వచ్చారు.
సి.బి రావూ గారు వస్తారని ఎదురు చూసాను కాని కొన్ని అనివార్య కారణాలవల్ల రాలేకపోయారని తెలిసింది. ఆ సమావేశానికి జ్ఞాపికగా ఒక్కొక్క కలం ( అమెరికా నుండి వస్తూ స్నేహితులకు యిద్దామని నే తెచ్చినవి కొన్ని మిగిలాయి లెండి ,వేరు వేరు రంగుల్లో రాసేవి ఎవరి చాయిస్ వారిదే.)బహుమానం యిచ్చాను. సి.బి రావు గారిదాకా వస్తుందో రాదో మరి. వారికి అంద లేదు. కొన్ని ఫోటోలు నా కెమేరాతో తీసుకున్నాను. దురదృష్ట వశాత్తూ అవి ఎలా కంప్యూటరుకు ఎక్కిన్చాలో తెలియక ఈ .పోస్ట్ లో పంపలేకపోతున్నాను.
ఆ తరువాత ఈ తెలుగు కార్యవర్గ సమావేశ చర్చ లేవో జరిగాయి. నేను ఆహ్వానితుడిగా ఆ చర్చలలో తలదూర్చలేదు. షుమారు సాయంత్రం అయిదు గంటలకు సమావేశం ముగిసింది. పార్కులో వున్న తేనీటి శాలలో తేనీరు సేవించి, తేనీటి దాత కు ధన్యవాదాలర్పించి అందరం యిళ్ళకు బయలుదేరాము.
శ్రీ శ్రీనివాస్ గారు, దూర్వాసులవారు తామూ తార్నాకా వైపు వేలుతున్నామనీనూ తమ తో పాటు రావలిసిందిగానూ ఆహ్వానించారు. వారి సహృదయతకు ధన్యవాదాలర్పించి శ్రీ శ్రీనివాసు గారి కారులో ప్రయాణం చేసి, శ్రీనివాసు గారి డ్రయివింగ్ సుతి మెత్తగా సాఫీగా సాగింది. మాటల్లో పడితార్నాకా వచ్చిన విషయం కూడా గమనించలేక పోయాను .
తార్నాకాలో దిగి ,మరో బస్సులోఎక్కి యి సి ఐ ఎల్ ప్రాంతానికి , అక్కడ నుండి అదే ప్రాంతంలో వున్న నా స్వంత గూటికి చేరుకున్నాను.