నవంబర్ 2015


కోలాటం .
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

అక్షరాలను
నిద్రలేపి

పదాలుగా
జతకూడి

వితర్కాన్ని
మైనస్ చేసి,

తర్కంతో
భావాలను
హెచ్చించి ,

సందేహాలతో
భాగించి

లవహారాలు
కర్మకు వదిలేసి

శేషమే చివరకు
అపురూపం

కూడికల తీసివేతల
జీవితం

భాగాహారం
హెచ్చవేతలలో
వ్యక్తీకరించడం

అర్ధమేటిక్
బ్రతుకులలో
సాహిత్యం
అనుసందానం

అది
జీవన
కోలాటం .

నువ్వే చెప్పు !
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

అక్షరాలు
నా సృష్టి కాదు
పద
భావాక్షర
సంకలనం
నే చేయలేదు

మరి

నా
వ్యక్తీకరణలు
నారాతలు
నాభావ వేదనలు
నా అక్షర భావపద
సంకలనాలు
చౌర్యం కాదా ?
నానేరంకాదా ?

మరి

నేనెలా చెప్పుకోను
ఈకవిత నాదేనని
రచించిందినేనని

ఈ భావం ఈ భాష
ఈ పదాలు
అక్షరాల కూర్పుల్లో
క్రమ విధాన భంగిమలూ
కనిపెట్టింది నేను కాదె

అక్షరం నేను కనిపెట్టలేదుగా
నాకన్నా ముందునుండి ఉందిగా
అక్షరాలు, గుది గుచ్చిన పదాలు
పదబంధ మాలికలా వాక్యాలూ
నేను సృష్టించినవి కావే!

నేను పుట్టేసరికే జనుల పెదవుల
నాట్యం చేస్తున్నవే కదా
భావాలు మనోజనిత వుత్ప్రేరితాలు
అన్నీ అప్పటికే బహిరంగ
వ్యక్తీకరణ లే గా!

మరి నాకుగా నేను ఈ భాషలో
భావంలో భాష్యంలో
సృజియించినదేముందని
వారూ వీరూ వేడి వేడిగా వాడుకొని
వాడి వాడి వదిలేసిన
వడి తగ్గిన
పదాలనటూయిటూ
కూరుస్తూ ఏదేదో గిలికేస్తూ
పలుమారులు మారుస్తూ
కాకెంగిలి చేస్తూ
కవితనై కురుస్తూ
భావాలను వర్షిస్తున్నానని
మది లోలోతుల కులుకుతున్నా

నా మదిలో తిరుగాడే
వ్యధలను వెలిగ్రక్కాననుకొని
నా భుజం నేనే తట్టుకొని
శహభాష్ అనుకొని ….
అయినా ….
నేనెలా చెప్పుకోను చెప్పు……
ఈ కవితనై నేనే పలికానని
………………………………………………

DSCN5959
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
21-11-2015.

అదిగో అల్లదిగో
దూరంగా కృష్ణవేణి

చూడావల
కనుచూపుకందు
దేశానికి అన్నదాత
గుంటూరు జిల్లా

నాబాల్యపుటడుగుల
జ్ఞాపకాలసద్దులు
అద్దుకున్ననేల
బ్రతుకుకు
సుద్దులు నేరిపి
ముద్దులాడినట్టినేల

ఆమహితామాయి
తానె
భవ్యస్ఫూర్తి
పుణ్యమూర్తి
మాతృధాత్రి
గుంటూరుజిల్లా.

……………………….

స్వాస్త్య కవచం
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.
………………………………………
ఆ దృశ్యం
అత్యద్భుతం
మేఘాలమాటుకు
మటుమాయమవుతు
వన్నెలెన్నో
ఒలకబోస్తున్న
సూరీడు.
దురదృష్టం
వెంటాడుతూ
నన్ను…

కెమెరాలో
బ్యాటరీ అవుట్!

అక్కడ మరోరకం
తిప్పలు
ఆదృశ్యాన్ని
అక్షరీకరిద్దామని
జేబులుతడుముకున్నా
కాగితం ఉంది కాని
కలం మరిచొచ్చానని
అదో అసహన సత్యం.

మరోచోట కరుణారసదృశ్యం
రంగుల్లో
బంధించే వీలులేదు
రంగులు చెంతలేవు
అసలు కాన్వాసేలేదు
అనుక్షణం
అవి వెంటుండవుగా.

తీరా కెమెరా
సమకూర్చుకొని వచ్చానా
దృశ్యం కనుమరుగు.

కాగితాలు కలాలు,
రంగులు,కుంచెలు
సకూర్చుకు వచ్చేలోగా
జ్ఞాపకాల మెరుగులపై
పేరుకున్నకాల ఖండికల
మకిలలు మరుపులు
కాలగమన రీతుల్లో
వయసుతో క్రీడలు
ముదిమి అంటే
కాలానికీ
చులకనే.

గతాలు జ్ఞప్తికిరానీదు
మతిమరపు
అది
కాలగమనపు కాలుష్యపు పొర
అయినా మనిషికి
అదే స్వాస్త్య కవచం.

………………………………………

సాధనమ్మున  పనులు

సమకూరుతాయంచు

వేమనె ప్పుడోనుడివె

విశ్వమందు

ప్రతిభ, సాధనలు

దండిగా ఉండియు…

ప్రతిభకే పట్టంబు

కట్టగా వలెనన్న

ఎస్సెమ్మె స్సులన్న

ఆ ‘ఫ్యాక్ట’ రేలనో ?

అర్ధమై చావదె!

(నా వంటి)

మంద  మతికి  ….

రెచ్చగొట్టిన గుంటనక్కలు తోకముడిచాయి
రెచ్చిపోయిన పెద్ద పులులు గొంతు మూసాయి 
గ్రామ సింహం లక్కుతోటి సింహమయ్యింది

అంతర్జాల తెలుగు సేత …లేఖినిలో  రాత ….వీవెనుడి నేత.  
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు. 
 
అంతర్జాలం లొ తెలుగు.బ్లాగుల్లో తెలుగు. నేడు ముఖ పుస్తక పుటలలో సాహితీ సమాఖ్యాలలో తెలుగు, … ప్రపంచ వ్యాప్త తెలుగుల  తెలుగు వినియోగం. వెరసి తెలుగు ప్రపంచ వ్యాప్తి. ..  యీ సందర్భం లొ ఆధునిక యుగం లొ  అంతర్జాలం లొ తెలుగు వ్యాప్తిలో ,వినియోగం లొ నిత్యం స్మరించుకోవలసిన వ్యక్తులలో వీవెన్ అతి ముఖ్యుడు. అంతర్జాలం లొ తెలుగును పడుగు పెకల్లో పెనవేసిన వారిలో అతి ప్రముఖుడు. . యీ విషయం గురించి యీ కొద్ది రోజులుగా కొందరు తెలుగు రాసే ప్రక్రియల గురించి…. ప్రచారం చేయాలని లేకుంటే తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేయనివారవుతారని తెలియజేస్తూ తమవంతుగా తాపత్రయ పడుతున్నారు. వారికీ ధన్యవాదాలు.కాని యీ సందర్భంలో  ఈనాడు అంతర్జాలం లొ  తెలుగు లిపిని వినియోగించి తెలుభాషలొ మనం  వ్యవహరిస్తున్నామంటే  అందుకు కృషిచేసిన నిబద్ధులైన యువ శాస్త్రజ్ఞులను  వ్యక్తులు గాని, రచయితలు కవులు గాని,  ,తేలుగు భాషా ఔత్సాహిక యువత గాని మరువ కూడదు. వారిని గురించి  తెలుసుకోవలసిన  విషయాలు అనేకం. యే రంగమైనా సృష్టికర్తలను, ఆద్యులను  మరువ రాదు.
 
 
 గత ఇరవై సంవత్సరాల క్రితం  తెలుగులో  టైప్ మిషన్ పై టైప్  చేయగలిగే సదుపాయం వుండేది కాదు. ఆ తరువాత  సైక్లోస్తిల్ పరికరం తో  నకల్లు తీసుకొనే సదుపాయం వచ్చింది. ఆతరువాత తెలుగు టైపు రైటర్లు వచ్చాయి . ఇంతలో  టేబుల్ టాప్ కంప్యూటర్లు వచ్చాయి. కాని  అవి వచ్చినా నా తెలుగు భాషకి  వాటిని వినియోగించ లేకపోయాము. అలా కొన్నిసంవ త్సరాలు అలా సైక్లో స్తిలింగ్   పరికరాలతో గడిచిపోయింది. ఆతరువాతి కాలాలలో షుమారు ఏడెనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటా తెలుగుకి కొన్ని పరికరాలు కంప్యూటర్ కు అనుసంధానం  చేసుకొనే సదుపాయం  లభించినా అందరికీ లభ్యమయ్యేవి కావు. అదీ కాకుండా  వ్యక్క్తిగత కంప్యూటర్ లు  వేయికోక్కరికి అందుబాటులో ఉండేవి. 
 
గత అయిదేళ్ళ  క్రితం వరకు అంతర్జాలం వ్యక్తిగతంగా  అందుబాటులో  వుండేది కాదు. అలాగే టేబుల్ టాప్ కంప్యూ ట ర్లూన్నూ. ఆఫీసులకు సాఫ్ట్ వేర్ కంపనీలకు మాత్రమే పరిమితమై ఉండేవి. 
ఇంజినీరింగ్ కాలేజీల పెరుగుదల, వున్నత విద్యా వ్యాప్తి, అంతర్జాల విస్తరణ ,పి.సి ల సౌలభ్యత తో ఇంటింటా క్రమేణా పి సి ల వాడకం పెరిగింది. కాని అంతర్జాలం లబ్ది తక్కువగా వుండేది. అంతర్జాలం విప్లవాత్మకంగా వినియోగం లోకి వచ్చిన తరువాత   వ్యాపారవేత్తలకు మాత్రమే పరిమితమైన స్వంత  వెబ్ సైట్ ,వ్యక్తిగతంగా  ఏర్పాటు చేసుకోవాలనుకొనే  ఉత్సాహవంతులకు  ఆర్ధిక వరుల లేమి . ఆ తరుణం లొ  వారికీ బ్లాగులు ఓ వరం అయ్యాయి కాని తెలుగు లిపి అందుబాటులో లేక ఆంగ్ల లిపిలోనే తెలుగు వ్యవహారం జరుగుతుండేది. 
 
అప్పటి కాలాలలో యాహూ , గూగుల్ , మైక్రో సాఫ్ట్ ,వంటి అంతర్జాల సంస్థలు ,యేవో కొన్ని అంతర్జాతీయ భాషలలో తప్ప తెలుగు పరికరాలు పొందుపరచ లేక పోయాయి. 
అట్టి పరిస్థితిలో అంతర్జాలం లొ తెలుగును ప్రవేసపెట్టి వినియోగించాలని ఉత్సాహం తో కొందరు ఉత్సాహవంతులు సాఫ్ట్ వేర్ విజ్ఞానవంతులు అంతర్జాలంలో వినియోగించేందుకు పరిశోధనలు  చేసి తెలుగు పరికరాలు సృష్టించి అందుబాటులోకి తెచ్చి అంతర్జాలం లొ తెలుగు భాషా ప్రతిభను  ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళారు.  వారిలో  ..ప్రముఖులు…వీవెన్ “.లేఖిని.ఆర్గ్ సృష్టి కర్త. “ఇ”  తెలుగు సంస్థకు ,సిద్ధాంత కర్త.సంధాన కర్త. 
అంతర్జాలం లొ వీవెనుడు తెలుగు నేత  నేయక ముందు తెలుగు బ్లాగర్లు ఆంగ్ల లిపిలో తెలుగు పదాలు రాసే వారు . బ్లాగులను పిచ్చాపాటి చర్చిన్చుకోనేందుకు వినియోగించే  వారు. సాహితీ ప్రక్రియలకు అంతగా వినియోగించే వారు కాదు. అప్పటికి బ్లాగులు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ల వరకే పరిమితమయ్యాయి. ఎందుకంటే కంప్యూటర్ లు వారి వద్దె ఉండేవి కనుక. 
 
గత అయిదు సంవత్సరాల క్రితం కూడా బ్లాగ్ అంటే సామాన్య జనులకే కాదు విద్యావంతులకూ అవగాహన లేని తరుణం. 
బ్లాగులు  విరివిగా  వినియోగం లోకి వచ్చి న గత అయిదు సంవత్సరాలలో  అంతర్జాతీయంగా అంతర్జాలం లొ మహత్తరమైన అభి వృద్ధి సాధించింది తెలుగు భాష. ఔత్సాహిక రచయితలు కవులు ,పత్రికలలో తమ రచనలు ప్రచురణకు నోచుకోని  ఎందరో , బ్లాగుల ద్వారా తమ రచనలు వివిధ ప్రక్రియలలో అంతర్జాలం లొ ప్రచురించడం ప్రారంభించారు. తొలినాళ్ళలో పిచాపాటి సంభాషణలతో  ప్రారంభమైన బ్లాగులు సాహిత్య వేదికలుగా పరిణతిని పొందాయి. అంతర్జాతీయ అంతర్జాల కవిసమ్మేళ నాలకు  వేదికలుగా నిలిచాయి.  తరుణం లొ ఫేస్ బుక్ అందుబాటులోకి వచ్చి అభిప్రాయాలు పంచుకొనే స్థితి నుండి సాహిత్యాభివృద్ధికి ఓ వరంగా మారి పోయింది. నాకు అవగాహన ఉన్నంత వరకు  ఆ రీతిగా ఫేసు బుక్ లొ అభిప్రాయాలు పంచుకొనే వేదికగా ప్రారంభించ బడిన  న తొలి వర్గపు సాహితీ సమూహం” తెలుగు సాహితీవలయం ” అందలి  ప్రాధమిక సభ్యులు సృష్టించినవే  ఫేస్ బుక్ లొ నేటి అనేక  తెలుగు సాహితీ సమూహాలు. రోజుకువివిధ ప్రక్రియలలో కొన్ని వందల తెలుగు సాహిత్య ప్రచురణలు. తెలుగులో వస్తున్న వార ,పక్ష, మాస, త్రైమాసిక పత్రికలన్నిటా ప్రచురించబడుతున్న సాహిత్యానికి మించి బ్లాగులలోనూ, ఫేసుబుక్ తెలుగు సమూహాలలోనూ  ప్రచురించబడుతున్నకవితలు, వ్యాసాల్పూ, అభిప్రాయాలూ, కథలూ, కొన్ని నవలలూ , ఇలా విస్తరిస్తూ దినదిన ప్రవర్ధమానమై ,తెలుగు భాష యడల యువతను ఆకర్షిస్తున్నాయి. అందున అత్యధిక రచనలు యువతనుండే .  ,తెలుగు భాషాభి వృద్ధికి మహత్తరమైన సేవలను …అంతర్జాల సౌకర్యాలు అందిస్తున్న తరుణం లొ ,మనమందరం ..  యీ సందర్భం లొ ఎందరినో .స్మరిన్చుకోవలిసి వుండి. 
 
అంతర్జాల సృష్టికర్తలైన    శాస్త్రజ్ఞులకు, అనేక రీతుల వినియోగకరమైన  సదుపాయాలను ప్రపంచానికి అందిస్తున్న  ప్రపంచ సాంకేతిక సమూహానికి హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపవలసిన యీ తరుణం లొ ..
తెలుగు భాషను అంతర్జాతీయంగా ప్రసిద్ధిపొందేలా తెలుగులో వ్యవహరించడానికి అనువైన పరికరాన్ని స్రుష్టించిన యువ శాస్త్రజ్ఞులకు మీదు మిక్కిలి లేఖిని సృష్టి కర్త “వీవెన్” కు ప్రత్యేక అభినందనలు తెలియ పరచడం మన విధి. 
 
నేడు ..యాహూ, జిమెయిల్, బరః ప్యాడ్ వంటి అనేక సంస్థలు తెలుగు పరికరాన్ని అందిస్తున్నాయి . తెలుగు భాషాభి వృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నాయి. భవన నిర్మాణం లొ పునాది రాయిని మరిచినట్లు  మరువకుండా ,నిబద్ధతతో ,అకున్తిత దీక్షతో అచంచల మైన కృషి చేసిన “వీవెనుడు ” వంటి మహత్తర వ్యక్తులను, యితరులనూ    తెలుగు సమాజం  గౌరవించి సకల విధాల ప్రోత్సహించి   అట్టి వారిని, ఎందరో మహానుభావులు అందరినీ  గౌరవించుకొని  జాతి శిరసా నమస్కరించా వలసి వుంది.  
 
వేల సంఖ్యలో తెలుగు బ్లాగులు . ఇంగ్లీషు లిపిలో తెలుగు రాసుకున్న కాలాలు.  పిచ్చాపాటి సంభాషణలతో తొలినాళ్ళలో వినియోగింపబడిన  తెలుగు బ్లాగులు నేడు గొప్ప సాహిత్య నిధులు.   
 
రాసిలోనూ ,వాసిలోనూ , దినదినాభి వృద్ధి చెందుతున్న బ్లాగులూ, “ముఖ పుస్తక” సాహితీ ప్రపంచం ” తెలుగు భాష అభివృద్ధికి మహత్తరమైన  సేవలు అందిస్తూవున్నాయి. , తెలుగు యువతకు మహత్తరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. సామాజిక స్పృహను కలిగిస్తున్నాయి.. వారిని తెలుగు భాషవైపు ఆకర్శిస్తున్నాయి.  తెలుగులందరూ ….”అంతర్జాల తెలుగు సేత …లేఖినిలో  రాత ….వీవెనుడి నేత”.   వీవెన్ . ఎ తెలుగుకు చేస్తున్న కృషికి ధన్యవాదాలు చెప్పి తీరవలసిందే ప్రతీ తెలుగు వ్యక్తీ. 
 

దిగ్విజయం e తెలుగు సమావేశం.

నూతక్కి రాఘవేంద్ర రావు. 

e తెలుగు సంస్థ వారు 11-12-2011 న భాగ్య నగరం లొ నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలుగు బ్లాగర్ల సమావేశాలు దిగ్విజయంయ్యాయి. 

నిర్ణీత సమయానికి సమావేశ స్థలికి చేరిన తెలుగు బ్లాగర్లను సభ నిర్వాహకులు శ్రీ కశ్యప్,శ్రీ వీవెనుడు స్వాగతించారు. 

శ్రీ కశ్యప్ ఆహూతులను సంబోధించి ,అంతర్జాలం లొ తెలుగు వినియోగానికి సదుపాయాలందించే కృషిలో గత ఎన్నో సంవత్సరాలుగా తము చేసిన కృషిని వివరిస్తూ … internet లొ తెలుగు వాడుక నాడు నేడు వైవిధ్యాన్ని వివరించారు.

ఇంటర్నెట్ కై వాడే వివిధ ఆంగ్ల సాంకేతిక పదాలకు అనుగుణ్యమైన తెలుగు పదాలను కొన్నిటిని 
తాము సిద్ధం చేసి వియోగం లోకి తెచ్చినట్లు వివరిస్తూ , వాటిలో కొన్నిటిని ఉదహరించారు. అంతర్జాలం=Internet, జాలము =net,

blog =గూడు group=గుంపు, సమూహము వంటి క్లిష్టతరమైన అనేక తెలుగు పద ప్రత్యామ్న్యాయాలను అంతర్జాలం లొ వినియోగం లోకి 

తెచ్చి ప్రభుత్వ,దృశ్య పత్రికా మాధ్యమాల ప్రసంసలు పొందిన విషయం తెలియజేసారు. 

లేఖినీ.ఆర్గ్ …లేఖిని తెలుగు కంపైలర్ సృష్టికర్త శ్రీ వీవెనుడు e-తెలుగు కరపత్రాన్ని విడుదల చేసి మాట్లాడుతూ ఇంగ్లీషు రాని తెలుగువారు 

కూడా తమ అవసరాల కొఱకు కంప్యూటర్లనూ, ఎలెక్ట్రానిక్ పరికరాలనూ మరియూ అంతర్జాలాన్ని వినియోగించుకో గలిగే స్థితికి తీసుకొని 

వచ్చి తద్వారా తెలుగు భాష మనుగడకు తమవంతు కృషి చేయడం ముఖ్య ఆశయంగా e-తెలుగు కృషి చేస్తుందని వివరించారు. 

ప్రచారం ,సాంకేతిక సహాయం,అవగాహనా సదస్సులు,స్థానికీకరణ,తెలుగు వికీ పీడి యా వంటి స్వేచ్చాయుత ప్రాజెక్టులలో పాలుపంచుకోవడం,

ఆ విషయమై ఔత్సాహికులకు తోడ్పడటం,వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. ఇంటర్నెట్ లేకుండా నూ తెలుగులో టైపు 

చేయడం ,తెలుగులో చూడగలగడం వంటి విషయాలలో ఎదురయ్యే సాంకేతికపర సమస్యలకు,పరిష్కారాన్ని పొందేందుకు 

support@etelugu.org అన్న e mail చిరునామా లొ సంప్రదించ వలసినది గా కోరారు . 

ఆహూతులైన బ్లాగర్లు సభకు తమను తాము పరిచయాలు చేసుకొని తమ తమ బ్లాగుల చిరునామాలు, మరియు తాము తమ బ్లాగుల్లో 

ప్రచురించే విషయాల గురించి సంక్షిప్తీకరించిన తదుపరి తేనీటి విందు, వందన సమర్పణ కార్యక్రమాలతో సభ ముగిసింది. 

ఇరవై అయిదు మంది బ్లాగర్లు పాల్గొన్న యీ సభలో సభ్యులు అందరూ సభా ప్రారంభ సమయానికి విచ్చేసి సమయ పాలన పాటించడం ,

ఇద్దరు స్త్రీ బ్లాగర్లు విచ్చేయగా, ఒంగోలునుంచి, గుంటూరునుండి ఒక్కొక్క బ్లాగరు సభకు విచ్చేయడం తొలిమేరుపైతే , సభ చివరివరకు 

సభ్యులు ఓపికగా వుండటం కొసమెరుపు.

Deepavali 2011 232

స్వామి శ్రీ వివేకానంద …వుద్భోద

(“భారత జాతికి నా హితవు ” అన్నస్వామి వారి చిరు గ్రంధం ఆధారం. )

నీ పై నీకు నమ్మకము ఆత్మ విశ్వాసము

లేనప్పుడునీవు ప్రపంచంలోని కోట్లాది దేవతలపై

నమ్మకముండి పూజించినా ప్రయోజనం శూన్యము.

ఆత్మ విశ్వాసమున్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర.

తర్వాత పేజీ »