Raajakeeyam


యాభై మూడేళ్ళు

రచన :నూతక్కి

 తేది: 15-02-2010.

 రాష్ట్ర విభజన అనేక పీట ముడులతో, సంక్లిష్టతతో కూడుకొన్న అంశం. ఆనాడు అప్పటి గౌ.ప్రధాని జవహర్లాల్ నెహ్రూ,తెలంగాణాప్రాంతాన్ని,ఆంధ్ర రాష్త్రంతో కలిపాలని చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల, వుత్పన్నమయిన పరిణామాలకు, యీనాటికీ. నెత్తి పట్టుకు కూర్చుని పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మనం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న కోర్కెకు అవతలి పక్షం లేవనెత్తుతున్న అభ్యంతరాలలో వున్న న్యాయబద్ధ అంశాలు పరిగణనలోకి తీసుకొని యోచిస్తూ సమన్వయంతో,సమ్యమనం పాటిస్తూ ముందుకు సాగవలసింది పోయి దురుసు రీతులతో వుద్యమ నాయకులు సంక్లిష్టతను స్రుష్టిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో మనం మన ఆకాంక్షలకు ఎంత ప్రాధాన్యం మిస్తున్నామో, అవతల వారి వుద్దేశ్యాలకూ విలువలు వుంటాయనేది గమనించ వలసిన విషయం. , మన అభిలాషలకు అనుకూలంగా పరిణామాలు లేకుంటే విధ్వంస పూరిత వుద్యమాలు , ఏకపక్ష విస్ఛిన్న పోకడలు ప్రోత్సహించడం సోచనీయం.చర్చల ద్వారానో మధ్యవర్తుల ద్వారానోసమస్య పరిష్కారానికి అవకాశమే లేని విధంగా అవతలి ద్వారాలను తామే మూసివేసుకొంటున్నారు.

అటు తమిళులూ యిటు తెలంగాణీయులూ “తకిట తకిట తక్ తధోమ్” అంటూ ఆంధ్రులను “మ్రుదంగం” చేసి వాయించారు. యిప్పుడూ అదే పనిలో వున్నారు. .కేంద్రం ఆంధ్రను ఫుట్బాల్ అనుకొంటోంది.తనఆటకొరకు ఆంధ్రులను బంతిలాఎడాపెడా తంతోంది.

నిజాము పరిపాలనలో పాలకుల వివక్షత వల్ల తాము కోల్పోయిన వ్యక్తిత్వావికాసానికీ, పొందలేకపోయిన అక్షరాశ్యతకూ,తద్వారా కోల్పోయిన వుపాధి అవకాశాలకూ భూసంపదకూ, అన్నింటికీ ఆంద్ర ప్రజలను , ఆంధ్ర ప్రాంత పాలకులను,భాద్యులను చేసి దుర్భాషలాడుతూ,యువతలో ఆంధ్రుల యడల అకారణ ద్వేషాగ్నిని రగుల్చుతున్న రాజకీయవేర్పాటు వాదుల విధాన శైలి గర్హనీయం.బాధాకరం..

 యీ విషయంలో వేర్పాటు వాద యువకుల ఆవేదన ఆందోళన త్రుటిలో పరిష్కారం అయ్యేదికాదు. విభజనా వాంఛ అవతలి వారి మౌలిక ప్రయోజనాలకు,హక్కులకు, విఘాతం కలిగించే విధంగా వున్నఫ్ఫుడు, దానిని నెరవేర్చడం వల్ల దేశంలో యితర ప్రాంతాలలోనూవిభజనా భావ విస్పోటనలు వుధ్భవిస్తాయనుకున్నప్పుడు దేశ సమైక్యతకూ,,సమగ్రతకూ,సుహ్రుధ్భావ వాతావరణానికీ భంగం కలగని రీతిలో నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ భాద్యత.

అది చిటికెలో జరిగే పని కాదు. ” వేర్పాటు పడాలనీ ,స్వయం పాలన కావాలనీ, మా యాభై సంవత్సరాల కోరిక….యిది మా ఆత్మ గౌరవ సమస్య..”.. తెలంగాణ వేర్పాటువాదుల వాదన….. సమైక్యంగా వుండాలనేందుకు వుత్తరాంధ్ర,సీమాంధ్ర ప్రాంతీయులు, న్యాయమైన ఒక్క పాయింటు నైనా చెప్ప మనండి అని వేర్పాటు వాదులు అక్కసుగా అడిగే ప్రశ్న.

వుత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయల సీమ ప్రజలకూ …ఆత్మ, గౌరవం వుంటుందికదా.వారికీ న్యాయబద్ధమైన కోరికలు సమైఖ్య రాష్ట్ర పౌరులుగా వారి హక్కులు ఎవరూ కాదన లేనివికదా!. సమైక్య రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వుండాలన్న వారి కోరికలో న్యాయబద్ధ కారణాలు అనేకం వారూ చెప్ప వచ్చు కదా?

అందులో కొన్ని….. మద్రాసు రాష్ట్రం నుండి విడివడి, స్వంత రాజధాని నగరాన్ని అభివ్రుద్ధి చేసుకొనే దశలో,రాజకీయ జిమ్మిక్కుల వల్ల రాజధానినీ, హైకోర్టునూ త్యజించి తమ వునికిని పోగొట్టుకొని, సరిపెట్టుకొని,…. హైద్రాబాద్ నగరంలో ఎన్ని విధాల త్రుణీకారాలు ఎదురైనా సహిస్తూ, అదే తమ రాజధాని నగరమని మనసా భావించి ఆ నగరంతో అనుబంధాన్ని పెంచుకొని, గతయాభై యేళ్ళ నుండీ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ నినాదం తోనే వున్నారు,వుత్తరాంధ్ర,కోస్తాంధ్ర, సీమాంధ్రులు. వారిదీ తెలంగాణియుల వాదనంత పాతదే కదా.

వాస్త వానికి ఆంధ్రులు తెలంగాణాతో కలవకుండా వుండి వుంటే ..నెహ్రూ జిమ్మిక్కులలో చిక్కడి వుండకపోతే… వారు యీసరికి,గడచిన యాభై మూడు సంవత్సరాల కాలంలో…ఎంతో సాధించుకొని వుండేవారు.

1) రాజధానిగా ఒక ప్రణాళికా బద్ధమైన ఒక మహత్తర సుందర నగరాన్ని సకల హంగులతో నిర్మించుకొని వుండి వుండే వారు. 2) పారిశ్రామిక అభివ్రుద్ధిని సాధించుకొని వుండి వుండేవారు.

 3) లక్షలాది మందికి వుపాధి నిచ్చే సినిమా పరిశ్రమ,…. నిరంతర భయ భ్రాంతులతో బ్రతుకు వెళ్ళదీస్తున్నతెలుగు సినిమా పరిశ్రమ… యీ సరికి యీ యాభై యేళ్ళలో తనదని సగర్వంగా,సగౌరవంగా చెప్పుకొనే ఓ శాశ్వత చిరునామా పొంది వుండేది.

 4) యీ యాభై మూడు సంవత్సరాల కాలంలో………రాజధాని హైదరాబాద్ నగర అభివ్రుద్ధి నిర్మాణంలో, పరిశ్రమలూ,విద్య, వైద్య,పారిశ్రామిక, ,చలన చిత్ర, నివాస గ్రుహనిర్మాణ ,వుపాధి రంగాలలో,సాఫ్ట్ వేర్ రంగంలో, …యిలా ఎన్నింటిలోనో ….. అభివ్రుద్ధి పరచి,యాభై మూడేళ్ళ సమయాన్ని, ధనాన్ని శ్రమను వ్రుధా పరిచామా ?,బూడిదలో పోసిన పన్నీరు చందంగా చేశామా అన్న ఆవేదన. ….

 తెలంగాణీయుల కన్న ఎక్కువ మానసిక అనుబంధాన్ని,ఎమోషనల్ భాందవ్యాన్ని హైద్రాబాదుతో పెంచుకున్న.వుత్తరాంధ్ర,సీమాంధ్ర,కోస్తాఆంధ్ర ప్రజలు……. హైద్రాబాద్ మాది అని తెలంగాణీయులు అన్నప్పుడల్లా, భయ భ్రాంతులవుతూ కూడా , హైద్రాబాద్ తో వున్నఎమోషనల్ భాందవ్యాన్ని, తెంచుకోవడానికి, ,సిద్ధంగాలేరు.

యాభై సంవత్సరాల తమ వంతు శ్రమ ,ధనాదుల త్యాగ ఫలాలను, కోల్పోవడానికి కూడాఆంధ్రులు సిద్ధంగా లేరు.

 5) వుమ్మడి ఆర్ధిక వనరులతో పారిశ్రామిక నగరంగా కేంద్రీక్రుతమైన,కేంద్ర రంగ భారీ పరిశ్రమల హబ్ గా మారిన పూర్ణ కుంభం హైద్రాబాద్ తో సహా తెలెంగాణ విడిపోవడానికి వుత్తరాంధ్ర కోస్తా సీమ ప్రజలు అంగీకరించరు.

 6) తమ భవిష్యత్తరాలకు పారిశ్రామిక వుపాధి దొరకని శూన్య రాష్ట్రాన్నిఅందించేందుకు ఆంధ్రులు సిద్ధంగా లేరు.

7) గడచిన యాభై మూడుసంవత్సరాలలో రాష్ట్ర ప్రజల వుపాధి అవసరాల కనుగుణంగా పారిశ్రామిక అభివ్రుద్ధిని విస్త్రుత పరుచుకొని వుండేవాళ్ళు. తమ రాష్ట్రం యధాతధంగా వుండి వుంటే తమ రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించుకొని అన్నిప్రాంతాలు పారిశ్రామికంగా సర్వతోముఖాభివ్రుద్ధి చెందేలా, దేశంలోనే, మహోన్నత పారిశ్రామిక విప్లవం సాధించి వుండేవారు.

8) తమ వంతు శ్రమ ధనం నిష్కల్మష నిబద్ధతతో వడ్డించిన విస్తరిలా తీర్చి దిద్దిన,యాభై సంవత్సరాల ప్రగతి ఫలాలు,శ్రమ ఫలితాలను, తామొక్కరే స్వంతం చేసుకోవాలన్న దురాశతో తెలంగాణ వుద్యమ కారులు, రాష్త్రంలోని యేకైక పారిశ్రామిక కేంద్రీక్రుత ప్రాంతాన్ని తన్నుకు పోదామని చూస్తున్న యీ తరుణంలోఆంధ్ర ప్రదేశ్ రాజధాని,పారిశ్రామిక, వాణిజ్య రాజధాని అయిన హైద్రాబాద్ నగరాన్ని వదులుకోవడానికి వుత్తరాంధ్ర, సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. అందుకే విభజనలో రాజధాని హైద్రాబాద్ నగరం,నగర పారిశ్రామికీకరణ, కీలక అంశాలుగాపరిగణనలోకి వస్తాయి… ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

 అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు, వుత్తర సీమాంధ్ర ప్రాంతాలలోనూ, హైద్రాబాద్ కు దీటుగా ,నగరాల అభివ్రుద్ధిని,ప్రోత్సహించి వుంటె,భారీపారిశ్రమలు,విద్య ఆరోగ్య్య గ్రుహ నిర్మాణ,పరిశోధనా రంగాలను అభివ్రుద్ధి పరచి వుపాధికి మార్గ నిర్మాణం చేసి వుండి వుంటే, ….

గ్రేటర్ హైద్రాబాద్ నగరం వుమ్మడి రాజధానిగా వుండాలని గాని, సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ గా అవిభాజితంగా వుండాలనిగాని, వారు పట్టు బట్టి వుండే వారు కాదేమో.

వారి ఆందోళనను ఇప్పటికైనా సహ్రుదయంతో అర్ధం చేసుకొని, పైన తెలిపిన అంశాలు కీలక అంశంగా భావించి స్రుహ్రుధ్బావ వాతావరణంలో అర్ధం చేసు కొని, పరిష్కార మార్గాలు వెదకడం ఒక్కటే ప్రస్తుత సమస్యకు పరిష్కార మార్గం.

యీ భారీ పరిశ్రమలూ,కార్యాలయాలూ, పరిశోధనాలయాలూ ఆనాడే స్థాపనా దశలోనే అన్ని జిల్లాలకూ ఒకటో రెండో చొప్పున విభజించి స్థాపించి వుండి వుంటే అసలు తెలంగాణ రాష్ట్ర నినాదమే వచ్చేది కాదేమో.

పరిశ్రమల కేంద్రీకరణలో జరిగిన అనాలోచిత చర్యలు, వెనుకకు తీసుకోలేని తప్పిదాలే, అది ఎన్నడు జరిగినా, ఎవరు చేసినదైనా….. ప్రస్తుత తరుణంలో ఆ పరిశ్రమలను ముక్కలుగా విభజించి ఎవరి వంతు వారి ప్రాంతానికి తరలించలేము కాబట్టి,యితర ప్రాంతాలలోనూ అంత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికీకరణ అమలు జరిపి ,జరగబోయే క్రమంలో తప్పిదాలు జరుగకుండా,యే ప్రాంతానికీ వివక్షత జరగకుండా సమన్యాయ పరిష్కారం లభించి అన్నదమ్ముల్లా విడి పోవడం న్యాయం

కాని,యితర ప్రాంతీయుల న్యాయమైన హక్కులను హైజాక్ చేయాలనుకోవడం విద్రోహపూరిత కుట్ర గా భావించ వలసి వస్తుంది…

 ఈ క్రమంలో యువకులు ప్రాణ త్యాగాలు చేయకుండా సమస్య పరిష్కారాని కి శాంతియుత మార్గంలో చేయవలసిన త్యాగమార్గాలు అనేకం వున్నాయి. యిచ్చి పుచ్చుకొనే రీతిలో కూడ త్యాగాలు చేయవచ్చు. వివేకంతో .వ్యవహరిస్తే విగ్నత..

 ఇక పోతే, సరిహద్దుకు ఎంతో దూరంలో వున్న నగరం రాజధాని నగరంగా వుమ్మడిగా ఎలా సాధ్యమో అని కొందరి మిత్రుల సంశయం. ఆ కాలంలోభాగ్యనగరానికి ఎన్నో మైళ్ళ దూరంలోవున్న , అప్పటికి విదేశీ ప్రాంతమైన బందరు రేవు నుండి, ఎగుమతులు దిగుమతుల కొరకు ఎడ్ల బండ్ల పై రవాణా నిర్వహించిన నిజాం, అందులకై ఆంగ్లేయ ప్రభుత్వంతొ తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.. అదే మార్గంలొ ఆంధ్ర ప్రాంతం నుండి నిత్యావసర ఆహార పదార్ధాలూ దిగుమతి చేసుకొనే వాడు.,

 కాబట్టి గ్రేటర్ హైద్రాబాద్ నగరం ,వుత్తరాంధ్ర సీమాంధ్రులకు, ఆ రోజునా, యీ రోజునా అంతే దూరం, రేపూ అంతే దూరంలో వుంటుంది. వుమ్మడి రాజధానిగా వినియోగించుకోవడానికి అదేమీ అభ్యంతరకరం కానక్కర లేదు.

మరో రాజధానిని నిర్మించుకొనేందుకు, సమూలంగా జరుగవలసిన పారిశ్రామికీకరణ కు కలిగే ఆర్ధిక భారం యిటు తెలంగాణ భరించినా, అటు కేంద్రం భరించినా ఎంతో సమయంతో కూడిన వ్యవహారం…

ప్రస్తుత తరుణంలో దాయాదుల పోరువల్ల నూతన రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయం,పారిశ్రామికీకరణకు అయ్యే వ్యయం, విద్యా వైద్య రంగాల్లో వున్న వ్యత్యాసాలు సరి చేసేందుకయ్యే వ్యయం,కేంద్రమో ,యేర్పడబోయే తెలంగాణ రాష్ట్రమో భరించాల్సి వుంటుంది. అవన్నీ పూర్తయ్యేంత వరకూ, పారిశ్రామికీకరణ పూర్తయ్యేంత వరకూ, హైద్రాబాద్ నగరమే సీమాంధ్రులకూ రాజధానిగా వుంచాల్సిన అవసరం వుంటుంది.అది సాధ్యం కాదనుకున్న తరుణంలో వుమ్మడి రాజధానిగా గ్రేటర్ హైద్రాబాద్ ను ఎట్టి వివక్షతా చూపకుండా వుమ్మడి రాజధానిగా అంగీకరించి తీరాలి.

 ఒక లక్ష్యం సాధించాలనుకొనే వాడు, మౌలిక లక్ష్య సాధనకై కొన్నింటిని కోల్పోవలసి వచ్చినా సిద్ధపడటమన్నది విగ్నత. రాజధాని నగరాభివ్రుద్ధిలో, అన్ని రంగాలలో , ఆంధ్రులూ తమ వంతు శక్తి, యుక్తులనూ, శ్రమ ధనాదులనూ ఒడ్డి , వడ్డించిన విస్తరిలా ,నగరాన్ని తీర్చి దిద్దిన తరుణంలో అన్ని రంగాలలోఅభివ్రుద్ధి చెందిన ప్రదేశంగా ప్రపంచంలొ పేరు ప్రఖ్యాతులు పొందిన రాష్ట్రం, ముక్కలుగా విడిపోవడం,బాధాకరమే…….సమైక్య ఆంధ్ర ప్రదేశ్ అఖండంగా కొనసాగాలని సమైక్యవాదిగా యీనాటికీ నా ఆకాంక్ష.

రాష్ట్రానికి పట్టిన(చిదంబర) గ్రహణం వీడేనా?

రచన:నూతక్కి,

తేదీ: 01-01-2010 2009

చివరి ఘడియల్లో చందమామకు పట్టిన గ్రహణం 2010 సంవత్సరం ప్రారంభ ఘడియలొచ్చేసరికి విడివడింది. అలాగే 2009 చివరి నెల మొత్తం పట్టి పీడించిన గ్రహణం 2010 మొదటి నెలలోనైనా వీడి రాష్ట్రమంతా సుహ్రుధ్భావ వెన్నెల కాంతులు విరజిమ్మేనా?

 

ద్రుష్టి సారించని మరో ద్రుఃక్కోణం.

 

(ద్రుష్టి సారించని, కీలక ధ్రుఃక్కోణంకేంద్ర పరిశ్రమలు,ల్యాబులూ,కార్యాలయాలూ)

నూతక్కి30-12-2009

ప్రపంచంలో ఎక్కడైనా జీవన ప్రమాణాలు వూర్ధ్వ గతిలో కొనసాగటంలో, విద్యుదుత్పత్తి, పారిశ్రామికీకరణ,

 

 వ్యవసాయ వుత్పత్తులకు,జలవనరులు, అతిముఖ్య భూమిక పోషిస్తాయన్న విషయం యెవరూ కాదనలేనిది.ఈవిషయంపై అవగాహనలేకో ,మరి అత్యుత్సాహమో కాని, రాష్ట్రం మొత్తానికి చెందవలసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలనూ, రాష్త్ర ప్రభుత్వ విభాగాలనూ ఒకే చోట రాజధాని హైద్రాబాద్ లోనే కేంద్రీకరించి ఆ ఒక్క నగరం మాత్రమే అభి వ్రుద్ధి చెందేలా, వారు ఆ రోజున చేసిన విధాన నిర్ణయానికి, యీ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్త్రంలో యీ వుద్రేకాలకూ కక్షలూ కార్పణ్యాలకూ , తమకు తెలియకనే పరోక్షంగా కారణమైన అప్పటి సీమాంధ్ర కు చెందిన ముఖ్యమంత్రుల నిస్వార్ధమైన ఆలోచనలుయీ రోజున వికటిస్తూ మహోద్రేకాలకు, చీలికల దిశకూ కారణమౌతున్నాయి.

వారు నిస్వార్ధంగా, పాలనా సౌలభ్యం కొరకు, అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలనూ హైద్రాబాద్ లోనే కేంద్రీకరించారు. ఇందువల్ల యితర ప్రాంతాలకు జరిగిన అన్యాయం యింతా అంతా కాదు.
అందు చేత వివిధ ప్రాంతాల ఆర్ధిక సామాజిక అసమానతల మూల కారణాలను యిప్పటికైనా వివిధ ప్రాంత రాజకీయ పార్టీల అధినాయకులు, విగ్నతతో గమనించి,అన్ని ప్రాంతాలకూ న్యాయమైన రీతిలో …..ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నయీ సమయంలో, సమన్వ్యంతోనూ సమ్యమనంతోనూ, సమయస్పూర్తితోనూ, వ్యవహరించ వలసిన అవసరం ఎంతైనావున్నది.
హైద్రాబాద్ నగరం చుట్టుప్రక్కల వున్న అయిదు జిల్లాల లో స్థాపించబడిన కేంద్ర ప్రభుత్వపారిశ్రామిక సంస్థలు,హైద్రాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ,మెహబూబ్ నగర్ , అయిదు జిల్లాలలో విస్తరించి వున్నాయి.ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఎప్పటినుండొ వున్న బొగ్గు గనులు,అనేక వేలమందికి వుపాధి కల్పిస్తున్నాయి. అవి కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలే. భారత దేశంలోనే అత్యధిక వుపాధికి అవకాశాలున్న ఏకైక ప్రాంతం. ఆంధ్ర ప్రదేశ్ లోని హైద్రాబాద్ తో కలిసి వున్న తెలంగాణా ప్రాంతం.
1)

 

బి.హెహ్..ఎల్,2) బిడిఎల్,

3)

 

బి..ఎల్

4)

 

అయ్.డి.పి.ఎల్,

5)

 

హెచ్. ఎం.టి.,

6)

 

హెచ్. ఎ.ఎల్,

7)

 

హెచ్.సి.ఎల్,

8)

 

.సి.అయ్.యెల్,

9)

 

ఎన్.ఎఫ్.సి

10)

 

ఎన్.ఎమ్.డి.సి

11)

 

డి.ఆర్.డి ఎల్

12)

 

డి.ఎల్.ఆర్.ఎల్

13)

 

ఎమ్.ఆర్.ఎల్

14)

 

అర్.అర్.ల్యాబ్స్

15)

 

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

16)

 

సెక్రెటేరియట్

17)

 

పోలీస్ అకాడెమీ,హెడ్ క్వార్టర్లు,

18)

 

అసెంబ్లీ,

19)

 

హైకోర్టులు

20)

 

టంకశాలలు,

21)

 

సివిలింజినీరింగ్ హెడ్ క్వార్టర్లు

22)

 

విద్యుత్ కేంద్ర కార్యాలయాలు

23)

 

ఆర్ టి సి కేమ్ద్ర కార్యాలయాలూ

24)

 

రైల్వే కేంద్ర కార్యాలయాలు.

25)

 

మిలటరీ కార్యాలయాలు

26 )

 

సెంట్రల్ యూనివర్సిటీ

27)

 

అయ్ అయ్ టి

30)

 

ఇంకా యెన్నెన్నో,వాటికి తోడు యాన్సిలరీ ఇండస్ట్రీస్. లక్షలాది వుద్యోగాలిచ్చే భవిష్య పారిశ్రామికాభివ్రుద్ధి ప్రణాలికలు.

31)

 

ఇవే కాక, సినిమా పరిశ్రమ, తరలి రావడానికి శతాబ్దాలు పట్టినా ,కొన్ని వేలమంది స్థానికులకు భుక్తినిస్తున్న సినీపరిశ్రమ గురించి ఎంతచెప్పినా తక్కువే.అవే కాక యింకా యెన్నెన్నో పరిశ్రమలు ప్రైవేటు భాగస్వామ్యంలో,సీమాంధ్ర ప్రాంతీయుల ఆధ్వర్యంలో అక్కడి స్థానికులకున్నూవుపాధి కల్పిస్తున్నవి..

యీ ప్రాంతంలో వున్నట్లు, పైన పేర్కొన్నసంస్తలు, కార్యాలయాలూ, సీమాంధ్రలోనూ ..ప్రతి జిల్లాకో కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమను స్థాపించి పారిశ్రామిక అభివ్రుద్ధి పెంపొందించి, సకల సౌకర్యాలతో మరో రెండు రాజధాని నగరాలు సమకూర్చిన తరువాత, జలవనరులు, సక్రమంగాపంచిన తరువాత మాత్రమే, మునుముందు మరో విభజన జరుగే అవసరం లేకుండా రాష్ట్రాన్నిమూడు భాగాలుగా విభజించడం యేనాటికైనాఅవసరం. అప్పటి వరకూ రాష్ట్రం అవిభాజ్యంగా వుండటం చాల అవసరం.
హైద్రాబాద్ మాది అని సీమాంధ్ర ప్రజలుభావించడంలో వున్న న్యాయాన్ని,అందుకై తెలంగాణీయుల అబ్యంతరానికి వున్న న్యాయమైన కోణాన్నీ, విపులమైన చర్చలద్వారా ,అంగీకారయోగ్యమైన రీతిలోపరిష్కారం రావాలేకాని, వినాశకర రీతిన సాగే వుద్యమాల ద్వారా సాధ్యం కాదని , విధ్యార్ధులూ,అన్ని రాజకీయ పార్టీలూ,వివిధ ప్రాంతాల ప్రజలూ,విగ్నులూ,మేధావులూ,న్యాయ వాదులూ.వుపాధ్యాయులూ,శాస్త్రగ్నులూ గుర్తించాలి.

పైన పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలూ, కార్యాలయాలూ, మిగతా ప్రాంత జిల్లాలలో ఎర్పరచి వున్నట్లయితే, తెలంగాణ సెపరేట్ చేసి హైద్రాబాద్ తో సహా మాకే యివ్వాలి అని తెలంగాణవాదులూ

, సమైక్యాంధ్ర అని మిగతా వారూ, యింత భయంకరమైన రీతిలో వుద్యమాలు చేయవలసిన అవసరం వుండేది కాదు.

హైద్రాబాదు లేకుండాసీమాంధ్రను వూహించడం ,కష్టమే .కనుకనే,
 
ముఖ్యంగా యిక్కడ స్థాపించబడిన కేంద్ర ప్రభుత్వ సంస్థలూ,కార్యాలయాలు.లేని రాష్ట్రం, సీమాంధ్ర వారు కోరుకోవడంలేదు.అందుకే వారి సమైఖ్యాంద్ర ప్రదేశ్ slogan.
 
రజాకారుల దౌష్ట్యాలతో మానసికంగా క్రుంగివున్న అప్పటి తెలంగాణీయులకు, అందరూ తమను మోసం చేస్తున్న భావనతోనే ఆలోచిస్తూ, తదుపరి తరాలకూ అదే నూరిపోస్తూ ,తమను తాము మభ్యపెట్టుకుంటూ, వుమ్మడి రాష్ట్రంలో తమకు జరిగిన మేళ్ళు మరచి పోతూ, ఆ కష్ట దశలో ఆంధ్రులు అందించిన సాంత్వన,సహకారం ,ధైర్యం ప్రోత్సాహం ,మరచి పోతే ఎవరుమాత్రమ్ యేమి చేయగలరు. అప్పులపాలైన కుటుంబాలు, దొరల సహకారం లేక, వంద రూపాయల విలువచేసే భూమిని ,వడ్డీ వ్యాపారులు యాభై రూపాయలకు స్వంతం చేసుకుంటుంటే రెండువందలరూపాయలు యకరాకు యిచ్చి కొనుక్కున్న ఆంధ్రులు, తమను దోపిడీ చేసి,ద్రోహం చేశారని ప్రస్తుత తెలంగాణా తరాలు భావిస్తున్నాయంటే, దానికి కారణం వారికి అన్నీ అసత్యాలే చెబుతూ,వాస్తవాలు ఎవ్వరూ తెలియజెప్పక పోవడమే.
తదుపరి తరాల మస్థిష్కాలలో,వాస్తవాలు కాక అబద్ధాలు మాత్రమే నూరి పోస్తూ, రెచ్చగొట్టటం, చరిత్రపై మందమైన పొగ కప్పు వేయడమే, దాన్ని రాజకీయులు తమ స్వప్రయోజనాలకు వుపయోగించుకోవడం, ఘోర తప్పిదమే అవుతుంది. లబ్ది పొందినవాటిని కప్పి పెట్టి ,పదేపదే నష్టపోయామని చెప్పుకుంటూ పోతే నవ తరాల యువకులు నమ్మక యేం చేస్తారు?మనసుల్లో కార్పణ్యాలు పెంచుకోక యేం చేస్తారు? యిప్పుడైనా యువకులు విగ్నతతో గతంలోని వాస్తవాలను అవగాహనతో అర్ధం చేసుకొని వ్యవహించ వలసిన సమయమిది.
యువతను పెడత్రోవ పట్టిస్తున్న రాజకీయులు వారి తాత్కాలిక ప్రయోజనాలు పొందవచ్చేమో కాని,భావి యువతకు మాత్రం తరగని నష్టాన్ని కలిగిస్తున్నారన్న మాట మాత్రం వాస్తవం.
విశాలాంధ్రగా కలిసిన తరువాత, తెలంగాణలోనూ ,సీమాంధ్రలోనూ, అనేక విడతలు విడదీత వుద్యమాలు వచ్చినా ,యే కొద్ది వైషమ్యాలో తప్పితే,యాభై అయిదు సంవత్సరాలు ,అన్యోన్యంగా, కలివిడిగా వున్న తెలుగు వాళ్ళమనసుల్లో స్వార్ధపరులు, నిరుద్యోగ రాజకీయులు,విషబీజాలు నాటితే,ఆకస్మికంగా విడి పడాలనే అభిప్రాయాలు కలిగడంలో యేమాత్రం ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు.
హైద్రాబాద్ చుట్టూరా కేంద్రీకరింపబడి,అయిదు జిల్లాల్లో విస్తరించి వున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు. రాష్త్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల తో సీమాంధ్రుల కుటుంబ జీవనపురోగతి ముడివడి వుండటంతోనూ,హైద్రాబాద్ ,తమ స్వంతమంటూ తెలంగాణా వారు వాదించటంవల్లనూ,అభద్రతా భావనలు…..నిరుద్యోగ రాజకీయుల ప్రేరేపణలూ,ప్రేలాపనలూ,తత్కారణంగా యింతటి దారుణ భయానక ఆందోళనలు.
అనేక రంగాల్లో దినదిన ప్రవర్ధమానమౌతున్న రాజధాని నగరాన్ని తమది కాదనుకోవాలనుకోవాలంటే మహానగరంలో స్థిరపడిన సీమాంతర వాసులకేకాక సీమాంధ్రలో గ్రామ గ్రామాన వున్న వారి కుటుంబసభ్యులకూ సాధ్యం కాని విషయం..అంతగా యీ మహా నగరంతో వారి మానసిక ఆత్మీయ అనుబంధం ముడివడి వున్న విషయం .యీ ప్రక్రియలోవారి మనోభావాలూ ఎంతగా దెబ్బతింటాయో విగ్నతతో అర్ధం చేసుకొవలసిన అవసరం , కలిసి వుంటే కలిగిన సుఖాలూ లాభాలూ అవగాహన చేసుకోకుండా ,యీ రోజు వుభయ ప్రాంతాల వాళ్ళూ పరస్పరం లాభం పొందిన తరుణంలో,ఒక ప్రాంతీయులు యీ రోజు విడివడదామనుకోవడం, కేంద్ర ప్రభుత్వ సంస్థలూ, కార్యాలయాలూ అనే వుపాధి కారక మరో కోణాన్ని మరవడమే.

అద్రుశ్యం !!!

 రచన : నూతక్కి

తేది: 20-12-2009

 వుద్యమిస్తున్న సూర్యుడు

అర్ధరాత్రి అంధకార నిశీధిలో

అర్ధంతర అనూహ్య అంతర్ధానం

 అనేకానేక సందేహాల

 స్థైర్య విహారం

 రక్షకభట విక్రుత విన్యాసమా?

 ప్రభుత్వ కుటిల వ్యూహమా?

 స్వీయ వ్యూహ కౌశలమా?

అంతరంగ మధనంలో

అనుయాయుల

ఆత్మీయుల

ఆందోళన! ఆక్రందన ! …..

ఆక్రోశపు వేదనలో

వలలు విసురుతూ

 రాష్ట్రం నలు దిక్కులా

రక్షకభట వర్గం

 
ద్రుతరాష్ట్ర కొలువులోగాంధారి చిద్విలాసం

  

రచన: నూతక్కి
  
  
 నాశనమౌతున్నా,యువత భవిత,
 

రాష్ట్రం రణరంగమై రక్తపుటేరులు 

పారుతున్నా ,ప్రాణాలే పోతున్నా, 

చోద్యంచూస్తూ,చిరునవ్వులు చిందిస్తూ 

చట్ట సభలో కళ్ళు తెరచి చూస్తూనే 

యింకా 

గంతలలోనే గాంధారి. 

తేదీ:19-12-2009

 

  

  

బ్యాక్ సీట్ పైలటింగ్.

 రచన :నూతక్కి

 Dt:17-12-2009

 బొమ్మముఖ్యమంత్రి, బొమ్మప్రధానమంత్రులను పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ….పర్యవసానం రాష్ట్రమంత అగ్ని గుండం..

ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి…….అన్నట్లు వాళ్ళిమ్మని చెప్పారు కాబట్టి, యిచ్చేస్తున్నామని చెప్పాం ,వాళ్ళిప్పుడు మోసం చేశారు,మాట తప్పారు.ఇది న్యాయమా?

యివ్వకపోతే అతడు చస్తాడేమోనని భయపడి యిచ్చాం.మాట తప్పారు.

మరిప్పుడు అక్కడా చచ్చేట్లున్నారు.అక్కడ చస్తున్నప్పుడు వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళకీ మాటిస్తే అక్కడి అగ్ని జ్వాలలు తగ్గుతాయికదా,

అలా సోనియమ్మమాట తప్పే మనిషికాదు.ఆమె యిచ్చిన వాగ్దానం తీర్చింది

యిదీ కాంగ్రేసు అధినాయకులు కేంద్రంలో ఎవరికి వారు చెప్పే మాటలు.

యిందులో నాకర్ధం కాని దల్లా యిందులో సోనియా పాత్ర యేంటి? సొనియా దెశాన్ని పాలిస్తోందా, యీ దేశంలో పార్టీల అద్యక్షులకున్న అధికారాలు, ఎన్నుకో బడ్డ ప్రభుత్వాలకు వుండవా? యితర పార్టీలు కూడా అధికారంలో వున్న పార్టీల అద్యక్షులకే తమ తమ పార్టీల డిమాండులు ఏకరువుబేడితే సరిపోతుందా?

ముఖ్య మంత్రీ, ప్రధాన మంత్రీ బొమ్మలేనా?

ప్రధాన మంత్రి , అతనేమి చేస్తాడబ్బా?భారత దేశపు రాజకీయాలలో అతని ప్రాముఖ్యత అస్సలేమీ వుండదా? అతని మంత్రివర్గం కూడా వుండాలికదా? అధికారం పొందిన పార్టీ అధ్యక్షులకు రాష్ట్రాలను చీల్చగలిగే అధికారాలుంటాయని కొత్తగా వింటున్నా.రాజ్యాంగం మార్చారా యీమధ్య? వీళిమ్మన్నారని, వాళ్ళేడ్చారని, ఇంకెవడొ చస్తాడని ,అంతేగాని,మనం ప్రజాస్వామ్య డేశంలో ప్రజలకు ప్రతినిధులం. అతి సున్నిత విషయం లో ప్రజల అభిప్రాయం ప్రజాస్వామ్య యుతంగా తీసుకుందామని కాని,పార్లమెంటులో పెట్టి వారి అభిప్రాయం ప్రకారం యివ్వాలో వద్దో తేల్చుకొని ఆ ప్రకారం ప్రక్రియ ప్రారంభింద్దాం అని కానీ, కనీస యింగితమింతైనా లేకుండా,పర్యవసానాలను ,ఇతరప్రాంత ప్రజల ఆత్మాభిమానాలను, ఆత్మ గౌరవాలను త్రుణ ప్రాయంగా భావించి, కేంద్రానికి ఎన్నికైన రాష్ట్ర ప్రతినిధుల్నిగానీ, ఆకేంద్ర ప్రభుత్వంలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులను కానీ సంప్రదించకుండానే, పరిస్తితి తమచేతులు దాటిపోతాయేమోనని, రాష్ట్రం పంచితే మనకేం లాభం? లేకుంటే మనకేమి నష్టం లాటి విషయాలు సడెన్ గా గుర్తొచ్చి  

తూకమేసిచూసుకొని,

యితర పర్యవసానాలూ లెక్కేసుకొని ,మహా అయితే ఆంధ్రలో నాలుగైదు రోజులు గొడవలు చేసి సర్దుకుంటారు.లేకుంటె ఒ పదిమంది చస్తారు. అంతేగా… మనకు పోయిందేముంది . అని అంచనాలేసి,చుట్టూ వున్నభజనగాళ్ళతో అర్ధరాత్రికి రాత్రి తెలంగాణ డిక్లేర్ చేయించిన నిక్రుష్ట రాజకీయం సోనియాది.యిరు ప్రాంతాలలో పలువురి ప్రాణాలు పోవడానికి కారకురాలు సోనియా.( వెనుక ఎవరి ప్రోద్బలమైనా వుండి వుండొచ్చు కాక.) అంత ప్రేమే తెలంగాణ పై వుంటే ఎప్పటినుంచో అడుగుతుంటే ఎందుకివ్వలేదు?ప్రజాస్వామ్య పధ్ధతులెన్నో వుండగా అసంబద్ధ విధానాలెందుకు?దేశానికే అధినాయకురాలైట్లు వ్యవహరించి ,యిప్పుడు తన మాట వెనక్కు తీసుకొంటే పరువు పోతుందన్నట్లు,ప్రజల ప్రాణాలతోనూ, భావి యువకుల జీవితాలతోనూ ఆడుకోవడమెందుకు?రాష్ట్రాన్నియిరు ప్రాంతాలలోనూ, అగ్నిగుండం చేయడం యెందుకు?విచక్షణ కోల్పోయివ్యవహారం చేస్తే,విగ్నత లోపిస్తే,పర్యవసానం ఎలా వుంటుందో, ఆంధ్ర, రాయల సీమల్లో, రగులుతున్న అగ్నిగుండం, లేకుంటే, తెలంగాణా లో జరుగబోయే వినాశనం,…యిదంతా సోనియా వల్ల జరిగిన బ్యాక్ సీట్ పైలటింగ్ విపరిణామం.దేశ ప్రజలకు భవితకు జరిగిన విఘాతం.

సమఝ్దారెవడు?   

రచన: నూతక్కి

తేదీ: 17-12-2009
 
రందిలేపి గుంజల్కూడగట్టి
సెంటరుకాడికెల్లి షామియాన దెచ్చి

పందిరేసి అందల

సల్లంగ పండి సిద్విలాసంగ

జూస్కుంటా ఆడు……..

తమకు తామె

రందిపడ్డ గుంజలు

పందిర్నిగూల్చ జూస్తె

కూలకుంట తపనపడి

పాట్లు పడత యీడు

 

సంక్షోభంలో సంక్షోభం

 రచన: నూతక్కి

తేదీ:15-12-2009

 త్రిదశ వత్సరాల

తెలుగు దేశం పార్టీ

ప్రాంతీయతా భావనల

 విభజనా వీచికల

సంకేతాల సంక్షోభం

స్వయంక్రుత అపరాధమా ?

 ద్వైధీ భావనా వేదనలు

 అధినేత రచియించిన

చాణక్య తంత్రమా ?

చారిత్రిక తప్పిదమా?

రాజకీయ వైఫల్యమా?

రాజనీతి వ్యూహమా ?

 అస్థిర పరిణామ

నేపధ్యపు విక్రుత

 మానసిక విన్యాసమా?

 స్థిర దీక్షా సంకల్పమా?

అర్ధం కాక అడుగుతున్నా

కుచ్చిత రాజకీయానికి సుహ్రుధ్భావ పరిష్కారం

రచన: నూతక్కి

తేదీ: 11-12-2009

ప్రస్తుతం రాష్త్రం లో వున్నఅస్తవ్యస్త పరిస్థితులలో 

వివిధ ప్రాంతాల వారు ఒకరికొకరు నిందించుకుంటూ ద్వేషభావాలు పెంచుకుంటూ క్రోధాగ్ని రగుల్చ్కుంటూ పోకుండా,

ఆంధ్ర,రాయలసీమ, వాసులు,తెలంగాణ వారిపై ద్వేష భావంతో కాకుండా, 

సానుభూతితో విశాల హ్రుదయంతో, విగ్నతతో ఆలోచించి విధ్వంసాలు ఆపి, విద్యార్ధులు విద్యా సంవత్సరం నష్ట పోకుండా, భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకొని ,భావితరాలవారికి భవ్యమైన,మరో రెండు రాష్ట్రాలు యేర్పరుచుకొని, వాటికై మరో రెండు అధునాతన రాజధానీ నగరాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మింప జేసుకొని, జరిగిన దానికొరకు అనవసర ఆందోళనలు వీడి,ఒకరికొకరు స్నేహ హస్తాలు అందించుకొంటూ,ఆనందమయ జీవనం గడప వచ్చు. అయితే అప్పటి వరకు రాష్ట్ర విభజన జరుగ రాదన్న,నియమానికి కేంద్ర ప్రభుత్వం వప్పుకోవాలి.క్రొత్త రాజధానీ నగరాలెక్కడ యేర్పాటు జరుగుతుందో తెలియ చెప్పాలి.  అందరికీ ఆమోదయోగ్యమైన సరికొత్త ప్రదేశాలను నిర్ణయించి ఆ నగరాలను నిర్మించాలి.పాత నగరాలలో యేర్పాటు చేయరాదు.

 అందుకు పరిష్కార మార్గాలు : 

కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ,యీ క్రింది విధంగా, రెండు రాష్ట్రాలను సాధించుకొంటే ఎవరికి వారు వారి వారి ప్రాంతాలలో నిశ్చింతగా వుండ వచ్చు.అందువల్ల ,రాయలసీమ వారి కీ,కోస్తావారికీ, వుత్తరాంధ్ర వారికీ, తెలంగాణావారికీ వారి వారి హక్కులు సాధించుకున్న మనో త్రుప్తి కలుగుతుంది. త్రిలింగ దేశమైన తెలుగుల దేశం త్రైయ్యాంధ్రగా మూడు రాష్ట్రాలు సుహ్రుద్భావాలతో, సొదర భావంతో కలిసి మెలిసి వుండవచ్చు.

 1) అప్పుడెప్పుడో కోల్పోయిన రాజధాని  కర్నూలు గురించి ఆక్రోశ పడకుండా  చింతించకుండా,

మరో రెండు రాష్ట్రాలు, మరో రెండు రాజధానీ నగరాలు,హైకోర్టు, సెక్రటేరియేట్,యితర ప్రభుత్వ భవనాలు,ఎయిర్ పోర్టులు, నిర్మించి  యివ్వాలని కేంద్రాన్ని కోరాలి

మరో రెండు వందల సంవత్సరాల వరకూ మార్చవలసిన అవసరం రాని అధునాతన,నవీన వనరులతో రెండు రాజధాని నగరాలను, ఒకటి గుంటూరు జిల్లా నైరుతీ ప్రాంతంలోకాని, దగ్గరలోని రాయల సీమజిల్లాలోకానీ,మరోకటి కాకినాడ ప్రాంతంలోనూ ,ఒక్కొక్కటి వంద చదరపు మైళ్ళ వైశాల్య లో  నిర్మించాలి.

 2)క్రిష్ణానదికి వుత్తరాన వున్న జిల్లాలతో వుత్తరాంధ్రనూ,

3) క్రిష్ణా నదికి దక్షిణంగా వున్న గుంటూరు,ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలూ రాయలసీమ జిల్లాలనూ కలిపి దక్షిణాంధ్ర గానూ ……….,

రెండు రాష్ట్రాలను యేర్పాటు చేయమని కేంద్రాన్ని అడగాలి .ఆ ప్రక్రియ మొదలైన తరువాతనే విభజన జరగాలి.

4) లోగడ ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ జిల్లాల్లో కలిపిన ప్రాంతాలను తిరిగి ఆంధ్ర ప్రాంతంలో కలపాలి. యితర రాష్ట్రాలలో కలిపిన తెలుగు ప్రాంతాలను ఆంధ్ర ప్రాంతానికీ ,తెలంగాణాకీ కలపాలి. కేంద్రపాలిత ప్రాంతంగా వున్న యానాం ను వుత్తరాంధ్రలో కలపాలి.

 5) భాగ్యనగరంలో వున్న విధంగా ,కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలొ,పెద్ద పెద్ద పరిశ్రమలు ఆంధ్ర రాయలసీమలలో వివిధ ప్రాంతాలలో స్థాపించాలి.

3)నదీజలాల, పంపిణీ సక్రమంగా జరగాలి.

4)వివిధ ప్రాంతాలకు రైల్,రోడ్ వ్యవస్తలుమెరుగు పరచాలి. కేంద్ర ప్రభుత్వమే ఖర్చుభరించాలి.

5)విద్యుథ్ ప్రోజెక్టులు ,సంప్రదాయేతర విధానాలతో  ముఖ్యంగా సూర్య శక్తి, సముద్ర అలల తో విద్యుత్ వుత్పాదనను అభివ్రుద్ధి పరచి బొగ్గుకై తెలంగాణా పై ఆధార పడకుండా చూసుకోవాలి..

 6) యిప్పటి వరకు హైద్రాబాద్, యితర తెలంగాణా ప్రాంతాల్లో వున్న, ప్రభుత్వ ,పారిశ్రామిక ప్రైవేటు వుద్యోగాల్లో వున్న వారిని ,పరిశ్రమలలో వున్న వారినీ, వుపాధ్యాయులను ,పోలీసు న్యాయ వ్యవస్తల్లొ, రెవెన్యూ వ్యవస్త లాంటి యితర ప్రభుత్వోద్యోగాల్లో వున్న వారిని,తెలంగాణ ప్రాంతంలోనే ఆయా వుద్యోగాలలోవుండనివ్వాలి. తెలంగాణలోని అంధ్ర ప్రాంతం వారి ఆస్తులకు రక్షణ కల్పించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి.

 7)రాజధానుల నిర్మాణం, ఎయిర్ పోర్ట్ ,రవాణా, రోడ్ ,విద్యుథ్ వ్యవస్తలకై అయ్యే ఖర్చు కేంద్రప్రభుత్వమే భరించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి.

కడుపులో కుళ్ళుతో, ఒకరిపై మరొకరు, ఎదుటి వారివల్ల ,తమకేదో అన్యాయం జరిగిందని భావిస్తూ,కలిసి వుండేకంటే సుహ్రుద్భావంతో విడిపోయి ప్రేమానురాగాలు పెంచుకొంటూ కలకాలం ఒకరికి మరొకరు స్నేహ హస్తం అందించుకోవడం మంచిది.

త్రిలింగ దేశంగా ప్రసిద్ధి చెందిన తెలుగుల దేశం త్రైరాష్ట్రంగా ప్రసిద్ధి చెందుతుంది.