జీవితకాలం తృప్తిగా జీవిద్దాం
రచన: నూతక్కి రాఘ వేంద్ర రావు.
1976 వ సం .
మనిషి తనలో సహజంగా వుండే నేను అనే అహాన్ని పారద్రోలి ,త్యాగ నిరతిని పెంపొందించుకొని ,మనం , మనమందరం ,మనందరిదీ సమాజం,అనే వుద్దేశ్యం వుధ్భవిన్చగా
అధికం చేసిన సమాజావసర వస్తువుల వుత్పత్తిని సదవగాహనతో,సరి సమానంగా పంచుకొని,సమ సమాజాన్ని స్థాపించడం సహకారోద్యమ ముఖ్య లక్ష్యం.
అనాదిగా మానవునిలో సహజంగా వుండే కొపోద్రేకాలు,ఈర్ష్యాసూయలు, మద మాత్స్తర్యాల వల్ల సంఘ జీవనంలో,అస్తవ్యస్త
పరిస్తుతులు నెల కొన్న తరుణంలో రాజరికాలు వచ్చి ,నియంతృత్వం చెలరేగి,ప్రజా వుద్యమాలకు కారణ భూతమయినాయి.
ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి .
అటుపరి పధ్యం తీసుకొంటున్న రోగి అతిగా తింటే అజీర్తి చేసినట్లు …లభించిన స్వేశ్చ స్వాతంత్య్రాలను సవ్యంగా వినియోగించుకోలేక, పెడ దారులు పట్టిన ప్రజానీకంలో
ధనవంతులు మరీ ధనవంతులై ,పేదలు కడు పేదలవుతుంటే..వారి కడుపు కింత తిండి పెడదామను కున్నప్రభుత్వాల ఆశయాలకు,ధనవంతులు అడ్డుగోడలై నిలువగా,
కాగితాలపై పెట్టిన సహాయ పధకాలు కార్య రూపం
పొందేందుకు అవరోదాలేర్పడ్డాయి.
అట్టి దురదృష్ట కర పరిస్థితిలో తమలో తామూ ఒదార్చుకొంటూ,సహకరించుకొంటున్న ఈ నిరు పేద వర్గం దృష్టి,సహాకారోద్యమం వైపు
మళ్ళింది.కోన వూపిరితో వున్న ఈ వుద్యమ లక్ష్యానికి వూపిరి పోసి,,బతికించి పోషించడం జరిగింది.
సహకార పరపతి సంఘాలు,సహకారసేద్య సంస్తలు,సహకార పారిశ్రామిక వాడలు,సహకార భూ తనఖా బ్యాంకులు,వంటి,అనేక సంస్తలతో చిలువలు పలవలుగా పెరుగుతున్న
ఈ సహకారోద్యమ వృక్షం ,మధ్య మధ్య,
చీడపురుగుల బారి పడి,పెరుగుదల వేగం తగ్గి పోతోంది.
ఆయా చీడ పురుగులలో ముఖ్య మయినవి:…….
1) నిధుల దుర్వినియోగం,
2) పక్షపాత ధోరణి, బంధు ప్రీతి,
3) అంతు పట్టని లెక్కల పద్ధతులు,
4) నిధుల నిర్వహణలో సులభ తరం కాని పద్ధతులు
5)సభ్యుల భాద్యతా రాహిత్య చర్యలు ,
ఇట్టి పరిస్తుతులలో చెట్టు వ్రేళ్ళకే చెదలు పట్టి కూకటి వ్రేళ్ళతో కూలి పోకుండా …
పటిష్టమైన ప్రణాళిక
నిర్దిష్టమైన పంపిణీ విధానం,
సక్రమమూ సులభ తరమూ అయిన పాలనా విధానమూ,
సంకల్పంతో సహకరించే యంత్రాంగమూ….,
వంటి, క్రిమి నాసిని మందులు వాడి …నిధుల సేకరణ అనే నీరు పోసి, ఈ మహా వృక్షాన్ని బ్రతికించి నిలబెట్టవలసిన భాద్యత మనందరిది.
అయితే రాజకీయాలనే గొడ్డళ్ళతో మొదలే నరికి వేయడానికి ప్రయత్నించే దుష్ట శక్తుల నుంచి, ఈ మహా వట వృక్షాన్ని రక్షించి,అట్టి
కుస్ఛిత రాజకీయాలకు అతీతంగా ,నిస్వార్ధ నిష్పక్షపాత వైఖరి అవలంబించగల భాద్యతాయుత నిర్వాహకుల అవసరం ఈ సహకార
రంగానికి ఎంతయినా వుంది. . అట్టి వారిని ప్రోత్సహించి
వారికి అందదండలనందించ వలసిన భాద్యత సభ్యులందరి పైనా వుంది.
ఇంతటి మహోన్నత ,మహోత్కృష్ట వుద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ- నిర్వాహకులు గానీ , కార్యకర్తలు కానీ, సామాన్య సభ్యులు
కానీ, కార్య నిర్వాహక సిబ్బంది కాని,—-స్వార్ధ చింతన వీడి,తోటి వారినుండి,స్వలాభేక్షను మరచి తన సాయి శక్తులా యితరులకు
తోడ్పడాలనే ఆకాంక్షతో ,ధృఢ చిత్తంతో ,నిస్వార్ధ భావనతో, పని చేద్దామని భావించినప్పుడు, ఈ మహా
వుద్యమం,మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లదా? ఆ ప్రయత్నంలో మనలో కలిగే తృప్తి , ఆనందం చాలదా జీవిత కాలం తృప్తి
గా జీవించడానికి?
——-